ఈ పుట ఆమోదించబడ్డది

48

చీనా-జపాను

చూరియా స్వాధీనమై యుండేడిది.1904-5 రష్యా జపాను యుద్ధములో రష్యా ఓడిపోయినది కనుక క్వాం టంగున్ను తూర్పు చీనా రెయిల్వే(దీనినే తరువాత దక్షిణ మంచూరియా రెయిల్వే అనిరి)చాలా భాగము న్ను జపానుకు స్వాధీనమైనవి.దక్షిణ మంచురియా వీరి ఆటలకు ఆటపట్టు(స్ఫియర్‌ ఆఫ్ ఇన్ప్లూయెన్సు) అయి నది.ఈవిధముగా జపాను సామ్రాజ్యము యొక్క పలుకుబడి ఆసియాలో వృద్ధియైనది.గనుకనే 1934 లో జపాను తన మన్రోడాక్టరిను ప్రకటించగలిగినది.

ఐరోపాయుద్ధము ప్రకటించగానే జపాను జర్మనీ యొక్క చీనా వలస రాజ్యములగు వెయిహినీను, షాంటంగుల ను, తత్ర్పాంతములందలి రెయిల్వేలను స్వాధీనము చేసుకొనినది.చీనాలో జర్మనీని ఒకా జపానే ఓడించి తన సామ్రాజ్యము నీరీతిని పెంచుకొనినది.చీనా రిపబ్లికు ప్రెసిడెంటు యుఆనుషిలేయిని వశీకరణ మొనర్చుకొని అతనిని చక్రవర్తిని చేయబూనినది.ఇట్లుచేసినచో గ్రేటుబ్రిటను, అమెరికాదేశములు తననెదిరించలేరనిన్ని,అంతగా యెదిరిస్తే కాస్త సదుపాయములు చేసి ఊరుకో పెట్టవచ్చుననిన్ని జపాను ఉద్ధేశ్యమై యుండెను.

1915 లో జపాను కాళసర్పసంఘమువారు డిమాండులను పెట్టిరి.వీనిని అయిదు భాగములుగా విభజింప వచ్చును.మొదటిభాగము ప్రకారము జర్మనీని చీనా నుండి తొలగించవచ్చును.రెండవభాగము ప్రకారము దక్షిణ మంచూరి