ఈ పుట ఆమోదించబడ్డది

20

చీనా-జపాను

కాని చీనా విప్లవపక్ష మంతసులభముగా ఓడిపోవునా?ఇప్పటికే కియాంగ్సీరాష్ట్రమంతయు వారిస్వాధీనమైనది. 1931 నవంబరు 7 వ తేదినాడే అక్కడ జూయికిన్‌ రిపబ్లిక్కు స్థాపింపబడి కాంటనుకమ్యూను పడిపోయిన కొరతను పూర్తిచేసినది.కనుక ఈ నాలుగవ యుద్ధముకూడ ఇంతకు ముందరి మూడు యుద్ధములవలె అతనికి పరాభవమునే కూర్చినది.అవతల ఉత్తరచీనాలోనా అతని ప్రతిష్ట పోయినది.దక్షిణమున తన సేనలకు దెబ్బలు తగులుచున్నవి.ఏమిచేయుటకును అతనికి పాలుబోలేదు.హూపే,హోనాన్,అన్హులెయి రాష్ట్రములు కూడా సోవియట్టు ఆధీనమైనవి.

అయిదవ యుద్ధము

అయినను చియాంగుకెయిషేకు సుప్రశస్త సేనాని.అతనికి చీనా పుంజీదారుల సహాయమేకాక జపాను, విదేశ ప్రభుత్వముల మద్దత్తుకూడా ఉన్నది.వెంటనే అతడు 8లక్షల సేనను జాగ్రత పెట్టెను.కాని సోవియటు సేనలు,వర్గములు ఇట్టి బెదరింపులకు లొంగునవి కావు.చియాంగుకెయిషేకు అయిదవయుద్ధము నింకను ప్రారంభిచకముందే యెఱ్ఱ సేనలు షెచ్వాను రాష్ట్రములో అకస్మాత్తుగా ప్రవేశించెను.నాన్‌కింగు ప్రభుత్వమునకు చెందిన రెండుదళములను,క్వాంగుటంగుకు చెందిన ఆరు దళములను కలిపి మొత్తముమీద క్యూమింగుటాంగునకు చెందిన 37 దళములనుయెఱ్ఱ సేనలు ఓడించి,4 లక్షల