పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/257

ఈ పుట ఆమోదించబడ్డది

కవులు భిక్షాటకులేనా?

261

శ్లో. “నవటా నవిటా నగాయకా
     నచ సభ్యేతర వాదచుంచవః
     నృప మీక్షితు మత్ర కేవయం
     స్తన భారానమితా నయోషితః’

యీ అర్థాన్నే బోధిస్తుంది వొక పద్యం.

మ. "కవితల్ నేర్చినఁ బాటపాడిన వృథా కష్టంబు లోకమ్ములోఁ
       బువుఁబోడుల్ కడుభాగ్యశాలినులహో! పుంస్త్వంబు . .
       చవివుట్టన్ సొగ సిచ్చి యించుక ... ... బెట్టి పుట్టింప నీ
       యవనీశాళి సమస్త మిచ్చును గదా; హా! పాపపున్ దైవమా!

కుట్టికవి మహిషశతకాన్నిబట్టి చూచినా మహాకవులలో నూటికి 19 మంది దారిద్ర్య దోషానికి గుఱి కావలసి వచ్చినట్టే కనపడుతుంది.

1) శ్లో. "ఆర్య శ్రీధర మంబుదీక్షిత మిమౌ దృష్ట్యా మహాపండితౌ,
         ............................ సకలం త్వం మే లులాయప్రభో"

2) శ్లో. “ఖ్యాతః కుట్టికవిస్తు దుర్ధనిగృహ ద్వారేషు నిద్రాయతే"

3) శ్లో. "తేషాం వక్రవిలోక నాత్తవవరం ... కోశేక్షణమ్”

ఇత్యాది శ్లోకాలు పరిశీలిస్తే లోకోత్తరులైన కవులందఱూ ధనికుల నాశ్రయింప వలసినట్లే కనపడుతుంది. కవులకన్న గాయకులకు యింకో చిక్కు కవియెక్కడికో కట్టుగుడ్డలతో - లేడికి లేచిందే ప్రయాణం' అన్న విధంగా వెళ్లి యే దాతనో

సీ. “బళిబళీ! మీతాత బళ్లెమ్ము చేఁబూని పుల్లాకు తూటుగా బొడిచినాఁడు"

అంటూ స్తోత్రం చేసి దుడ్డో దుగ్గాణో తెచ్చుకుంటాఁడు. పాపం గాయకునికి అట్టి వీలులేదు.

1) “అగస్త్యుఁ డొకయెత్తూ, కమండలం వొకయెత్తూ, 2) సెట్టి సేరూ లింగం సవాసేరూ” అన్నమాదిరి, తంబూరాగాని, వీణగాని, ఫిడేలుగాని మోసుకుపోవాలి. యెక్కడి క్కడ మద్దెగాఁడు కుదరాలి. కుదిరితే మాత్రం, వాఁడికీవీఁడికీ జత కుదరాలి. యిదంతా కుదిరి పాటకచేరీ జరిగితే-

“ఈ సభలో నింతకు లాభ మేమొ యనుచున్ సందేహం”. అందు చేతనే అనుకుంటాను గాయకులు వారివారి సంతతికి యే యింగ్లీషు ముక్కలో చెప్పిస్తారుగాని