పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/232

ఈ పుట ఆమోదించబడ్డది

236

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యీలాటి సరసమైన కవిత్వం యే పద్యకవి రచించాఁడో వొక్కఁడి పేరు చెప్పవలసిందంటే చెప్పఁగలమా? యేదో వొక్కటి మచ్చుకు కనపఱిచాను. (రేపూ వత్తువుగాని పోరా నేcటికి తాళి, వగయిరాలు చూచుకోండి) క్షేత్రయ్య కవిత్వంలో యిలాంటివి కొన్ని వందలున్నాయి. క్షేత్రయ్య శృంగార భక్తికోసం అవతరించిన మహాకవి. సంస్కృతంలో జయదేవ లీలాశుక నారాయణతీర్థు లేలాటివారో తెలుఁగులో క్షేత్రయ్య ఆలాటివాఁడు. పద్యకవుల కవిత్వంలో శ్రవణకటు ప్రయోగాలు- “శ్రోత్ర ఘచ్చటలు" వగైరాలు కుప్పతెప్పలుగా దొర్లుతాయిగాని పద కవుల కవిత్వంలో ఆలాటి శ్రవణకటువులు యెంతో వెదికితే యేమోగాని చట్టన దొరకనే దొరకవు. అసలే దొరకవని కూడా చెపుతాను.

హాస్యకవిత్వం చెప్పిన కవులు నలువురు వున్నారు.

“ఇందుకా? నీకుపంచాంగము చెప్పింది, యిన్నాళ్లనుసరించి యెద్దు తాకటఁబెట్టి మిద్దెటింటికి నిల్వుటద్దము తెచ్చింది పెద్దలఋణమటె ముద్దుcబెట్టు మటంటె మోము దిప్పుకొనేవు; కద్దబే యీరీతి కంచిగరుడసేవ IIఇందుకా!"

యీ గేయంలో ప్రతీచరణం చివరా వొక్కొక్క లోకోక్తి వాడఁబడింది. యీలాటి హాస్యరస గీతాలేకాక జాతీయగీతాలు-

"అగ్గితిరుణాళ్లంట : అర్జునుకతలంట"

అనే మాదిరివి చెప్పిన కవులున్నూ వున్నారు. కవి యేలాంటి వాఁడైనా సరే గేయం రచించడమంటూ వస్తే అది కైశికీవృత్తిలోనే నడుస్తుందిగాని యితర పెటుకు వృత్తులలో నడవకపోవడం వొక విశేషం.

“అనఘ! రాఘవ! కాముకుఁడనై అతివవలలను జిక్కితిని విను, వనమునకు ననిచి ప్రాణము లీ తనువునను మనవనెను భూపతి"

యిది అధ్యాత్మరామాయణంలోదే. దీనిలోనల్లా రెండు ఘకారాలున్నూ వొక భకారమూతప్ప తక్కినవర్ణాలు గానానుకూలాలే. క్షేత్రయ్య కవిత్వంలో యీమాత్రమూ వత్తక్షరాలు పడవని చెప్పవచ్చును.

"తెలివి యొకరి సొమ్మా యెందుకె విభుని తిరుగ పొమ్మంటినమ్మ"

యిందులో వక వొత్తక్షరం మాత్రమే కనపడుతుంది. ఇతనిగేయాలకు "మువ్వగోపాల పదాలు" అని వాడుక. యిదేపోలికలో వున్న మరి కొన్ని గేయాలుకూడా యితని పేరుతోనే వ్యవహరింపఁబడుతూ వున్నాయి.