పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/229

ఈ పుట ఆమోదించబడ్డది

పదకవులు

233



సురట - ఆది

'చేరి వినవె శౌరిచరితము గౌరి సుకుమారి గిరివరకుమారి'

యిది పరశురాములవారి యుద్ధాన్ని గూర్చిన కీర్తన. దీనిలో వుండే పదాలపొందిక వగయిరాలు గ్రంథకర్త సామర్థ్యాల్ని పూర్తిగా తెల్పుతాయి. యిందులో వుండే అంత్యప్రాస నియమం

“బెండువంటి విల్లు నడిమికి రెండుచేసి పెల్లు"

అని ప్రారంభించి చాలా భాగం నడిపి నడిపి ఆఖరికి

“నా విల్లు దండివైరులకు ముల్లు"

అని ముగించి అంతతో కూడా ఆపక మళ్లాదురితాన్ని ఉపక్రమించి అప్పుడు చరణాన్ని ముగించాఁడు. పద్యం వ్రాయడానికి కావలసిన సామగ్రి కంటె దశగుణంగా సామగ్రి వుంటేనేకాని ఆ యీ మాదిరి రచనతుదనెగ్గదు. (యీ కీర్తన వొక్కొక్కటి వొక్క శతకం అంత వుంటుంది) ఆ యీ పరిశ్రమ శ్రీనాథుడివంటి మహాకవికి తెలియకపోదు కనుక “ముదివిటులు” అని లోగడ వుదాహరించిన యీసడింపు ఎవరిదో అయివుంటుంది కాని బహుశః శ్రీనాథుఁడిది కాదేమో! అని నేను అనుమానిస్తాను. అయితే ఆధ్యాత్మకీర్తనలు శ్రీనాథుఁడి కాలానికి చాలా యిటీవలివై వుండడంచేత ఆయన యిది చూడక యేవో లాకలూ కాయల బాపతు "అక్షయపాత్రకు వచ్చినాయి మమ్మాదరింపుఁడమ్మా మూతులు విఱవక ముక్కులువిఱవక ముష్టి పెట్టరమ్మా" అనేమాదిరి కీర్తనలుచూచి అలా యీసడించి వుంటాఁడేమో! అని కొందఱు అభిప్రాయపడతారనిన్నీ యెఱుఁగుదును. కాని అధ్యాత్మకీర్తనలు చూడకపోయినా వాల్మీకి రామాయణశ్లోకాలు కుశలవులు (కుశీలవౌ కుశలవ నామధేయౌ) గానంచేసి రాముణ్ణి మెప్పించారన్న విషయమేనా శ్రీనాథుఁడికి అవగతంకాకుండా వుంటుందా? అయితే కుశలవులు ఆ రచనను గేయంగా మార్చుకొన్నా అవి శ్లోకాలేకాని పుట్టుకచేత కేవల గేయాలుకావు కనుక వాట్లకియీ "ముదివిటులు అనే పద్యపు యీసడింపు తగలదనిన్నీ కొందఱనవచ్చును. కాని యిప్పుడు ఖిలసంహితలాగు అంతరించిపోయినా శ్రీనాథుఁడి కాలానికి యీఅధ్యాత్మ కీర్తనలవంటి గేయరచన యేదోకొంత పూర్వకవులది వుండకుండా వుండదు. అలా వుండడమే తటస్థించి దాన్ని ఆ మహాకవి చూడడమే తటస్థిస్తే అలా ఆయన యీసడించడం పొసగదనే నేననుకుంటాను. శ్రీనాథుఁడిమాట అలా వుంచుదాం. వేణుగోపాల శతకం రచించిన కవి యెన్నాళ్లనాటి వాఁడోకాఁడు. అతఁడు ఆయీ ఆధ్యాత్మ రచన చూచేవుంటాఁడు. దీన్నిచూచినట్టి ఆధారం వెదికితే కాని చట్టన దొరకదుగాని తాళ్లపాకవారి గేయాలు చూచినట్టు