పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/87

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

చాటుపద్యమణిమంజరి

    పాలించె నేమంత్రి ప్రకటధర్మఖ్యాతి
                    మహిమ మీఱఁగ నాంధ్రమండలంబు
గీ. అతఁడు భూపాలమంత్రీంద్రసతతవినుత
    ధీవిశారదుఁ డచ్యుతదేవరాయ
    మాన్యహితవర్తనుఁడు శౌర్యమహితయశుఁడు
    భానుతేజుండు రామయభాస్కరుండు.
కొండవీటి గోపీనాథపురపు గోపీనాథస్వామి యాలయము ముఖద్వారశాశయందు వ్రాయఁబడిన యీపద్యమువలన నచ్యుతదేవరాయననాఁడు వేఱొక రామయభాస్కరుఁ డున్నట్లు ధ్రువపడుచున్నది. ఇంక రాయనభాస్కరులుకూడ ననేకు లున్నట్లు స్పష్టపడుచున్నది. మనలోఁ దండ్రిపేరు కుమారునకుఁ బెట్టెడు నాచారము కలదుగదా! దానివలననే యేకనామ మనేకులకుఁ బొసఁగియుండె నని తలఁపఁదగి యున్నది.
చ. కలయఁ బసిండిగంటమునఁ గాటయవేమసమక్షమందు స
    త్ఫలముగ రాయనప్రభునిబాచఁడు వ్రాసిన వ్రాలమ్రోఁతలున్
    గలుగలు గల్లుగల్లు రనఁ గంటకమంత్రుల గుండెలన్నియున్
    జలుజలు జల్లుజల్లు రనె సత్కవివర్యులు మేలుమే లనన్.
అను చాటుపద్యమువలనఁ గాటయవేమునికాలమున క్రై.1400న నొక రాయనభాస్కరుఁ డుండిన ట్లేర్పడుచున్నది.
శ్లో. శాకాబ్దే వసువహ్ని వేదధరణీగణ్యే చ ధాత్రబ్దకే
    వైశాఖే వినుకొండసీమని సుధీ ర్నాదెళ్ళ యప్పప్రభుః
    వాసిష్ఠాయచభర్తపూండి మఖిలంగ్రామం స్వనామాంకితం
    ప్రాదా ద్రాయనిభాస్కరాయ విదుషే ష్టైశ్వర్యభోగాన్వితమ్.

అను శాసనమువలన క్రై.1500 తర్వాత నొక రాయనభాస్కరుఁ డుండిన ట్లేర్పడుచున్నది. ముప్పదియిద్దఱు మంత్రుల