భారతకథనుగూర్చి చాటువులు
211
నిలువన్నేరఁ డధర్మవృత్తి ననుమా నీ విన్నియుం బల్కితిన్
బలవద్వైరమె కోర దుర్మరణముల్ ప్రాపించునంచాడుమా!
శా. పాండవులన్న దైవమును బౌరుషముం గలవారు వారికిం
గొండొక కీడు చేసి నిలఁగూడదు కూడనిలోభ మూని వీ
రిండితనంబునన్ దర హరింపనె చూచెదవేని వారు నిన్
బిండలిపం డొనర్తు రని పేర్చి యథార్థ మెఱుంగఁ జెప్పుమా!
ఉ. మచ్చరమేల కర్ణ! విను మానవు లర్జునితోడివారలా?
రచ్చల మెచ్చు లాడెదవు రాజును దమ్ములు నిచ్చ మెచ్చఁగా
వచ్చినవాఁడు ఫల్గునుఁడు వాని నెదుర్కొను యోధఁ జూడుమా
చెచ్చెర నూర జోగులకు శేషునికంఠము లంటవచ్చునే!
క. వరమునఁ గుంతికి సుతుఁ డై
వెరవెఱుఁగక యేటివరద విడిచినపిదపన్
ధరయెల్ల నేలెఁ గర్ణుఁడు
దరిఁ జేర్పను గూడువెట్ట దైవముగాదే!
గోలకొండ మాలముండ పూలకుండ కొత్తకుండ అనిపదములతో భారతకథకు సంబంధించునట్టు చెప్పఁబడినపద్యము—
గీ. ఓయి కురురాజ! నీకొడు కుత్తగోల
కొండవలెనుండు క్షణ మాల ముండ దిఁకను
భండనంబున గెల్తురు పాండుసుతులు
ఉదరమునఁ బూలదండ రే కొత్తకొండ.