వేములవాడ భీమకవి
111
వట్టిమానఁ జిగురు పుట్టింప గిట్టింప
బిరుదు లేములాడ భీమకవిని.
ఈతఁడు శైవుఁడు. పాల్కురికిసోమనాథుఁ డాంధ్రమున రచియించిన బసవపురాణము నీతఁడు కన్నడించెను. “సోమగురువాక్యములు సొన్పి భీమసుకవి, గరిమ బసవపురాణంబు కన్నడించె”—తెలుఁగున నృసింహపురాణము రచియించె నఁట! కవిజనాశ్రయముకూడ నీతనిదే యందురు. ఈతని నివాసము దాక్షారామముగాక నైజాంరాష్ట్రమందలి వేములవాడ గ్రామమని కొందఱందురు. అది చింత్యము. నృసింహపురాణమందలిదని యీపద్యము లక్షణగ్రంధములం దుదాహరింపఁబడెను.
క. ఈక్షితికి వచ్చి ముందుగ
దాక్షారామమున వారతరుణులనృత్యం
బీక్షించి యంతకంటెను
దత్క్షణమున నేర్చి రంభ తగ వేర్పడఁగన్
నృసింహపురాణమున—
క. కెంజిగురునకుం గఠినత
వంజకుఁ బాల్ పిచ్చుగుంటువానికిఁ బరువున్
నంజుడుకుఁ గమ్మఁ దావియు
లంజెకు మే లెందు లేదురా విటరాయా!
కోమట్ల నీతఁడు తిట్టెను.
చ. గొనకొని మర్త్యలోకమునఁ గోమటి పుట్టఁగఁ బుట్టెఁ దోన బొం
కును గపటంబు లాలనయుఁ గుచ్చిబుద్ధియు రిత్తభక్తియున్
ననువరిమాటలున్ బరధనంబును గ్రక్కున మెక్కఁ జూచుటల్
కొనుటలు నమ్ముటల్ మిగులఁ గొంటుఁదనంబును మూర్ఖవాదమున్.