తృతీయతరంగము
159
నట్టిరాజును వినుతింప నలవి యగునె?
రాజమాత్రుం డటం చనరాదు గాని
వేంకటాద్రీంద్రుఁ డంచును వినుతి సేయ
వలయు శ్రీవాసిరెడ్డి సత్కులజమణిని.
మ. సుమబాణాకృతి! వేంకటాద్రినృపతీ! శుంభత్ప్రతాపాఢ్య! నీ
యమరావత్యమరేశ్వరోన్నతసువర్ణాంచన్మణీగోపురో
ద్గమ మెన్నన్ ద్విజరాట్శశ ప్రథమదృక్ప్రాప్తస్థితిం గాంచి కా
ర్యము కాదంచును నిల్చెఁ గాక గగనం బంతంతకు న్మించదే?
మ. క్షయసంవత్సరమాఖశుద్ధశుభచంచద్ద్వాదశీజీవవా
రుయుతశ్రేష్ఠపునర్వసుప్రఝషసద్రాశిం దులాభారమే
నయశీలుం డమరావతీపురములోన న్దూగి నానార్థిసం
చయహర్షాప్తి ధనం బొసంగెఁ గవు లెంచన్ వేంకటాద్రీంద్రురీ
తి యనంగాఁ దగి వాసిరెడ్డికులము న్దేజంబుఁ జెన్నొందఁగన్.
ఉ. ఎన్నివనంబు లెన్ని కృతు లెన్న సురార్చన లెన్ని దేవళా
లెన్ని సువర్ణగోపురము లెన్ని తటాకము లెన్ని బావు లె
న్నెన్ని పురంబు లెన్ని కల వెన్నిక ధర్మము లెన్న ధాత్రిపై
బన్నిన వేంకటాద్రివిభుపాటినృపాలుఁడు లేడు చూడఁగన్.
క. శ్రీవాసిరెడ్డికులభవ
పావనుఁడై వేంకటాద్రిపతి భాసిల్లెన్
గేవలవాగ్దీపశిఖా
వ్యావృతకలధౌతకుంభితాహిమకరుఁడై.
ఉ. తద్దయు వాసిరెడ్డికులధన్యుఁడు వేంకటనాయఁ డర్థికిన్
గొద్దిగ నిచ్చె నేని నృపకుంజరు కొక్కనిపెండ్లి కౌ నహో
గద్దరి మేదినీశ్వరులు కద్దనియిచ్చినయీవి పూటకుం
జద్దికిఁ జాల దాయె నృపసందడి దాతల నెన్న దోసమే?