ఈ పుట ఆమోదించబడ్డది

20

బొబ్బిలియుద్ధనాటకము.

(ప్రథమ ద్వితీయాంకముల నడుమ)

ప్రవేశకము

స్థలకము. - బొబ్బిలి రచ్చచావడి.

(పలువురు బ్రాహ్మణులును బ్రాహ్మణస్త్రీలును ప్రవేశింతురు.)

ఒక బ్రాహ్మణుఁడు. - ఒరే సుబ్బన్నా, ఈబొబ్బిలివారి భూరి సంభావనలొ నీ కేమి దొరికిందిరా?

సుబ్బన్న. - నే నింకా లెక్ఖపెట్టుకోలేదురా, రామయ్యా. దోశెడు వరహాలు పోశారు నావొడిలో.

ఒక బ్రాహ్మణి. - [శిశువు నెత్తుకొని యుండి] ఇదుగోనండోయి మీకు మొగాళ్లకి దోశెడు వరహాలు ఇయ్యడం వొక ఆశ్చర్యమా ! మావంటి యాడాళ్లకి దోశెడు దోశెడు వరహాలు ఇచ్చాడు, ఆమహరా జెవరో ధర్మారావుష, రంగారాయనింగారి మామగారుష మా కియ్యడం ఏం విన్నారు! ఈ చంటిపిల్లకి ఒకదోశెడు.

రామయ్య. - చంటిపిల్లకి కూడా దోశెడే! [అని ఆశ్చర్యపడును.

బ్రాహ్మిణి. - ఇందుకే ఆశ్చర్యమా? నాచెల్లెలికి ఒకదోశెడు వరహాలు ఇచ్చాడు. 'చూలాలండీ' అంటే - 'ఆ! అలాగా? యీగుంపులో పాపం చాలా శ్రమపడ్డది!' అని 'యిందాండి, అమ్మా, పుచ్చుకోండి, గర్భములోని శిశువుకోసం పుచ్చుకోండి;' అని బతిమాలుకొన్నట్టు కడుపులోపలిపిల్లకి ఒక దోశెడు ఇచ్చాడు మహరాజు. [తోడిస్త్రీలను ఉద్దేశించి] రండే గోపాలస్వామిగుళ్లో పడుకొందాము. [స్త్రీలు నిష్క్రమింతురు.

రామయ్య. - ఔనుగాని, యీభోజనాలచేత నాపొట్ట పగలిపోఛూ వుందిరా! [దీనస్వరమున] ఏమోయి భీమశంకరం నీప నేలా గుంది?

భీమ. - నన్నా ? తిండికి పొట్ట పగలడ మేమిషిరా నాగమ్మా? ఆకాడికి నావీపు విరగొద్దుషరా, నాపృష్ఠోష్ఠపర్యంత భోజనానికి ? అలా అంఛే తెలుసునా ? వీపుమీద గ్రుద్దితే, క్రింద మెతుకులు ప్రడాలి; మెడమీద క్రొడితే, నోట బ్రూరెలు రాలాలి. మళ్లీమనిషికి ఢ్రోకా లేకుండా వుండాలి, భోజన మంటే. ఏమంటావోయి సోమయ్యా!

సోమయ్య. - అఘోరింఛావు లేవోయి! పృష్ఠోష్ఠానికే యింత బడాయి అయితే నా నఖశిఖ పర్యంత భోజనాని కేమంఛావు? వ్రత్తితే క్రాలిగ్రోరు క్రూడ ప్రప్పూ ధ్రప్ఫళం క్రక్కాలి; ముక్కు నులిమితే వ్రీశనెయ్యి ఔత్ఖానా క్రొట్టాలి.

భీమ. - ఓయి సోమప్పా, నీనఖశిఖానికే యింత విఱ్ఱవీ గే మోయి? మా అన్న