ఈ పుట ఆమోదించబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 8

కొండ పాదుషావారు మమ్ము బుస్సీదొరగారు హైదరుజంగుబహద్దరువారు యీరెండు కన్నులతో చూచుచున్నారు.

              ఆ. చల్లచూడ్కి మీరు సాఁచిన మామీఁదఁ
                  బాదుసాహి మాకు భద్ర మొసఁగు.
                  వేఁడిచూడ్కి మిారు వెట్టిన మామిాదఁ
                  బాదుసాహి మాకు భయ మొసంగు.

అ ట్లగుటంబట్టి : -

             శా. అప్రత్యక్షునిఁ బాదుషాహరి నెదన్ ధ్యానించి, మీకుం దదీ
                  య ప్రత్యక్ష పరార్ధ్య మూర్తులకు మాయర్చల్ సుతుల్ భ
                  క్షిప్రానుగ్రహకాంక్షచే ముడుపులున్ జెల్లించి, నిర్భీతి పూ
                  ర్వ ప్రాకామ్య వరంబు వేఁడెదను వీరవ్యాఘ్రలారా మిము

ఇచ్చట మాకు శుభసూచకములు కలిగిన నచ్చట మాకు శుభమే.

బుస్సీ. - మావలన నేమున్నది ? తమ భాగ్యమునకు గోలకొండ నిజా చిత్తము.

హైదరు - మేం వారి హుకుం నెరవేర్చే నౌఖర్లము. మాపని మీకీ తె వారికీకోషం.

                 పై కాము కట్టానీ పందాలకీ కర్కర్ నర్కీ కుప్పల్ కూ
                      మాపనీ నర్కీ కుప్పల్ కూల్చడం.
                 కళ్కళ్కళ్లాడేటి గ్రామాల్కి పట్ణాల్కి మల్మల్మ ల్మాడ్చెయ
                      మాపనీ మల్మల్మ ల్మాడ్చెయ్యడం.
                 కోటల్కి ఫిరంగీ యేటూలు దూటించి పాటీనేలల్ శెయ్య
                      మాపనీ పాటీనేలల్ శెయ్యడం.
                 దుర్గాలకీ పట్టి పుర్గు లేక కొట్టి గిర్గిర్గిర్ దొర్లించడం-
                      మాపనీ గిర్గిర్గిర్ దొర్లించడం.
                 లూటీల్కితీస్కెల్లి యేటేట గోల్కొండ్లో కోటెత్తుపోగొయ
                      మాపని కోటెత్తు పో గొయ్యడం.