ఈ పుట అచ్చుదిద్దబడ్డది
110 బిల్వమంగళ [అం 5
బిచ్చ - అబ్బే! ఇందులో ఏమీ లేదు...(తడబడును)
గోపా - లేకుంటే అది యీలాగు తే. ఆ ముడి ఎందుకు?
బిచ్చ - ఓహో! ఇది బృందావనము. (మూట పారవేయును)
చింతా - ఏమి నాయనా, నాతో నేస్తముకట్టి ఇంకొకనితో మైత్రి చేస్తావా?
గోపా - ఏమీ? కూడదా?
చింతా - ఆలాగైతే మనకు మైత్రి పొసగదు.
గోపా - పోనీ, నన్ను పిలిచినప్పుడే వస్తాను! (పో బోవును)
చింతా - ఆఁ ఆఁ. ఉండుండు.
గోపా - ఎందుకూ ? మనకు పొసగ దన్నావే! (పోవును)
బిచ్చ - బాబూ, బాబూ, కొంచె ముండు.
చింతా - అయ్యో! పోయెనే! నా కాకలి వేస్తూంది.
బిచ్చ - ఏమైనా తెచ్చిపెట్టనా?-అదిగో పిచ్చిది.
(పిచ్చిది వచ్చును)
పిచ్చి - తెలిసింది-శ్రీకృష్ణుడు నన్నుబ్రోచును, నాతల్లిని చూడగానే నాకు ధైర్యము చిక్కింది. కాత్యాయని నారాధించి గోపికలు శ్రీకృష్ణుని పొందినలాగు నే నేమి నాశ్రయించి నాకోర్కె సఫలము చేసుకుంటాను. మాఅమ్మ ఎవరితో