ఈ పుట ఆమోదించబడ్డది
కార్యాల్లో నిమగ్నం కావాలి - 1కొ 7,34. పవిత్రజీవితం జీవించాలి. ఈలా నిర్మల జీవితం జీవించడంలో నిర్మలమాతయైన మరియు ఆమెకు తోడ్పడుతుంది. మరియు కేవలం మనకు ఆదర్శమూర్తి మాత్రమే గాదు, ఓ సజీవవ్యక్తి గూడ. కనుక ఆమె తన బిడ్డలమైన మనకు వరప్రసాదాలను ఆర్జించిపెడుతూ అన్ని విధాలా సాయపడుతూంటుంది.
పూర్వవేదకాలంలో "హనవిం” లేక "దీనులు" అనే భక్తులు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రభువుమీద ఆధారపడి జీవిస్తూండేవాళ్ళు. తరచుగా పేదజీవితం జీవిస్తూండేవాళ్ళు. బాధలకు గురౌతూండేవాళ్ళుగూడ. నూత్న వేదంలో మరియు ఈ దీనుల కోవకు చెందిన భక్తురాలు. అందుకే ఆమె మహిమ గీతికలో "ప్రభువు నా దీనత్వాన్ని కటాక్షించాడు" అని చెప్పుకొంది — లూకా 1, 48. తాను పూర్తిగా ఆ ప్రభువు మీద ఆధారపడి జీవించింది. ఈమె గొప్పతనమంతా ప్రభువు పెట్టిన భిక్ష కావుననే ఆ పునీతురాలు సర్వశక్తిమంతుడు నాయెడల గొప్ప కార్యాలు చేసాడు అని పలికింది - లూకా 1,49. ఈ మరియలాగే మఠకన్యగూడ "దీనురాలు". ఆమె ప్రభువమీద ఆధారపడి జీవిస్తూండాలి. తనకు సిద్ధించే కష్టాలనూ అపార్థాలనూ వినయంతో సహిస్తూండాలి. మరియనుజూచి, మరియు సహాయంతో, తానూ ఈ దీనత్వాన్ని అలవరచుకోవాలి.
మరియు ఇప్పటి మఠకన్యల్లాగ మూడు ప్రతాలు చేపట్టలేదు. ఐనా ఆమె మూడు వ్రతాలను వస్తుతః పాటించింది. "నీ మాట చొప్పననే నాకు జరగాలి” అన్న వాక్యం ఆమె విధేయతకు నిదర్శనం. ప్రభువుకోసం ఆమె కన్యగా, పేదరాలుగా జీవించింది. ఈనాడు మఠజీవితంలో ప్రధానాంశం మూడు వ్రతాలనూ పాటించడం. ఈ జీవితం చాల కష్టమైంది. ప్రత్యేకమైన దైవానుగ్రహంలేందే ఈ ప్రయత్నంలో నెగ్గలేం. ఈ ప్రతజీవితంలో మరియ మఠకన్యకు ఆదర్శంగా వుంటుంది.
3. మరియ గృహస్థులకు ఆదర్శం
మరియు అంగీవేసికొని మఠజీవితం జీవించలేదు. బోలెడన్ని గొడవలతోగూడిన సంసారజీవితం జీవించింది. సంసార జీవితంలో మొదటి విషయం, భార్యాభర్తలు అనురాగంతోను ఒద్దికగాను జీవిసూండడం.
మరియా యోసేపులు అలా జీవించారు. మరియు ఆత్మశక్తివలన అద్భుతంగా గర్భవతి అయింది. ఈ రహస్యం మొదట యోసేపుకి తెలియదు. కనుక అతడు ఈ సంగతంతా విని బాధపడ్డాడు. కాని ఆమెపట్లమాత్రం కటువుగా ప్రవర్తించలేదు. మరియను రద్దిజేయకుండా పరిత్యాగ పత్రికనిచ్చి రహస్యంగా విడనాడదామనుకొన్నాడు - అంతే. మత్త 1,19. అనగా ఆమె పట్ల అతనికి ఎంతో గౌరవముండేది. ఆమె యోగ్యురాలనే అతని భావం. అలాగే మరియకూడ యెసేపని
39