5. "ప్రభూ! మీ విశ్వాసులకు ఈ జీవితం మారుతుందేకాని అంతంకాదు" అనే వాక్యం మనం మృత్యుభయం జయించడానికి ఏలా ఉపయోగపడుతుంది
6. ఇంచుమించు చనిపోయి మళ్ళా బ్రతికి బయటపడ్డవాళ్ళ అనుభవం ప్రకారం మృత్యువు భయపడతగింది కాదని ఏలా నిరూపిస్తావు?
7. విశ్వాసులు మంచి మరణానికి తయారుకావడం ఏలా?
అధ్యాయం - 2
1. తీర్పుని గూర్చిన వేదసత్యంలో ఇమిడివున్న మూడంశాలు ఏమిటివి? 2. సాధారణ తీర్పుని సమర్ధిస్తూ వేదశాస్తులు పేర్కొన్న కారణాలు తెలియజేయండి. 3. తీర్పుని గూర్చిన మత్తయి, లూకా, యోహాను భావాలనూ, వాటిల్లోని వ్యత్యాసాలనూ పేర్కొనండి. 4.తీర్చుని భయంకరమైనదాన్నిగా చిత్రించే నూత్నవేద వాక్యాలను పేర్కొనండి. 5. అక్రమ మార్గాలవల్ల లాభాలు గణించేవాళ్ళను జూచి మనంకూడ ప్రలోభానికి గురౌతూంటాం. న్యాయతీర్పుని గూర్చిన భావన మనం ఈ ప్రలోభం నుండి తప్పకొనేలా చేయగలదా? 6. మనం ఈ లోకంలో జీవిస్తుండగానే న్యాయనిర్ణయ దినానికి తయారుకావడం
ఏలా?
అధ్యాయం - 3
1.తొలిమూడు సువిశేషాలు, యోహాను, పౌలు, నరకాన్ని వర్ణించిన తీరును వివరించండి.
2.నరకాగ్ని అంటే యేమిటి?
3. "దైవసాన్నిధ్యాన్నికోల్పోవడమే నరకాగ్నిని గూర్చిన ముఖ్యాంశం" - వివరించండి.
4. "నరకం దేవుడు నరునికి పెట్టే శిక్షకాదు, నరుడు తనకు తానే విధించుకొనే శిక్ష - వివరించండి.
5.నరకం ఏలా శాశ్వతంగా ఉంటుందో తెలియజేయండి.