ఈ పుట అచ్చుదిద్దబడ్డది
18. శీలవ్యత్యాసం
నరులు ఒకేపని చేస్తున్నపుడుగూడ వాళ్ళవాళ్ళ శీలాన్నిబట్టి భిన్నభిన్నంగా ప్రవర్తిస్తూంటారు. కొందరు స్వార్థబుద్ధితో ఆత్మలాభం వెదకుతూంటారు. ఈలాంటి వాళ్ళను భగవంతుడు ఆదరించడు. కొందరు నిస్వార్థబుద్ధితో ప్రవర్తిస్తారు. భగవంతుణ్ణి పొందాలని కోరుకొంటారు. ఈలాంటి వాళ్ళను ప్రభువు కరుణిస్తాడు. దైనందిన జీవితంలో ఒకే కార్యరంగంలో పనిజేసే నరులు ప్రదర్శించే శీలవ్యత్యాసం గమనించదగ్గది.
1. కయానూ హేబెలూ అన్నదమ్ములు. ఇద్దరూ దేవునికి కానుకలు సమర్పించారు. ఐనా ప్రభువు కయీను కానుకను నిరాకరించి హేబెలు కానుకను చేకొన్నాడు. ఎందుకు? కయీనుది వక్రబుద్ధి హేబెలుది సరళబుద్ధి ఋజువర్తనులు కాని వాళ్ళు ప్రభువుకి ప్రియపడలేరు - ఆది 4,3-4.
2. ప్రభువు సౌలుని త్రోసివేసి దావీదుని రాజుగా ఎన్నుకొన్నాడు. సమూవేలు ప్రవక్త బేల్లెహేము వెళ్ళి యిూషాయి కుమారుడు దావీదును రాజుగా అభిషేకించాలి. యూషాయికి యెనమండుగురు కొడుకులు. వీరిలో దావీదెవరో ప్రవక్తకు తెలియదు. యీషాయి తన పెద్ద కుమారుడు ఎలియాబును సమూవేలు చెంతకు గొనివచ్చాడు. ప్రవక్త యొలియాబు ఎతూ రూపము చూచి మెచ్చుకొని అతన్ని అభిషేకింప బోయాడు. కాని ప్రభువు "నేనితన్ని నిరాకరించాను. నరులు వెలుపలి రూపానికి బ్రమసిపోతారు. కాని నేను లోపలి హృదయాన్ని పరిశీలిస్తాను" అన్నాడు. ఈ రీతిగా యిూషాయి తన కుమారుల్లో తొలి యేడురునీ సమూవేలు వద్దకు తీసికొని రావడమూ, దేవుడు వాళ్ళను నిరాకరించడమూ జరిగింది. అప్పుడు అతని కడగొట్టకొడుకు దావీదు ఎక్కడో పొలంలో గొర్రెలుకాచుకొంటున్నాడు. ప్రవక్త ఆజ్ఞపై యీషాయి అతన్ని పిలిపించాడు. దావీదురాగానే ప్రభువు ప్రవక్తతో "నేను ఎన్నుకొన్నవాడితడే. ఇతన్ని అభిషేకించు" అని చెప్పాడు. వెంటనే సమూవేలు అతనికి అభిషేకం చేసాడు. ఈ రీతిగా ప్రభువు ఏడురు అన్నలను కాదని ఎన్మిదవవాడైన దావీదునే ఎన్నుకొన్నాడు. ఎందుకు? ప్రభువుకి అతని హృదయం నచ్చింది - 1 సమూ 16,6–13.
3. గొల్యాతు మహవీరుడు. యుద్ధంలో కాకలుతీరిన జోదు. దావీదు పసివాడు. గొర్రెలు కాచుకొని బ్రతికేవాడు. వాళ్ళిద్దరికీ పోరుజరిగింది. సామాన్య పరిస్థితుల్లో గొల్యాతు దావీదుని పరుగును నలిపివేసినట్లుగా నలిపివేయవలసింది. కాని దావీదు ఒడిసెల రాతితో గొల్యాతు నొసటిని పగులగొట్టాడు. అతడు మొదలు నరికిన చెట్టులాగ గభీలున నేలమీద కూలాడు. దావీదు గొల్యాతు కత్తితోనే అతని మెడ తెగనరికాడు. గొల్యాతు కత్తిడాలు