ఇక నేడు క్రీస్తు ఉద్యమాన్ని కొనసాగించేది ఈ యాత్మడే
ప్రభూ! నీవు ఒకే దేవుడవైనా
ముగ్గురు వ్యక్తులతో కూడినవాడివి
కనుకనే నీవు మూడు దశల్లో
నిన్ను గూర్చి ప్రజల కెరుకపరచుకొన్నావు
తొలుత ప్రజలకు తండ్రినిగూర్చి మాత్రమే తెలిసింది
తర్వాత క్రీస్తునిగూర్చి కూడ తెలిసింది
కడపట ఆత్మనుగూర్చీ తెలిసింది
ఈ మూడు దశలూ క్రమంగా పితృశకం,
క్రీస్తుశకం, ఆత్మశకం అని పిలువబడతాయి
ఇప్పుడు మేము ఆత్మశకంలో వున్నాం
ఇక లోకాంతంవరకూ ఈ యాత్మశకమే కొనసాగుతుంది
నీలో నాల్గవవ్యక్తి లేడు కనుక నాల్గవ శకం లేదు
కనుక రెండవరాకడదాకా గూడ
ఆత్మడే యిక మాకు నాయకుడు
ఆ యాత్మడు కూడ మమ్మ తన చెంతకుకాక
క్రీస్తు చెంతకే చేరుస్తుంటాడు
అతని అనుగ్రహం లేందే మేము యేసే ప్రభువని యెంతమాత్రమూ విశ్వసించలేం
ఇప్పుడు మేమంతా ఆత్మశకంలో వున్నాం గనుకనూ
ఆత్మద్వారా తప్ప క్రీస్తును చేరలేం గనుకనూ
ఆ యాత్మనిపట్ల మేము భక్తిని
అత్యవసరంగా పెంపొందించుకోవాలి
అన్ని భక్తిమార్గాలకంటే ఈ యాత్మభక్తి అతిముఖ్యమైంది.
25. జీవజలం
కీర్త42,1-2, 63,1. యిర్మీ 2,13. యోహా 4, 13-14, 19,34. దర్శ 21, 6
తండ్రీ! నీవు జీవనప్రదమైన జలానివి
ప్రతి నరుడూ నీనుండి జీవజలం త్రాగి దప్పిక తీర్చుకోవాలి
కావుననే నీ భక్తుడైన కీర్తనకారుడు