పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/9

ఈ పుట ఆమోదించబడ్డది



1.బైబులు పరిచయం

బైబులు భాష్యం - 56

ఈ వ్యాసంలో మూడంశాలను పరిశీలిద్దాం. మొదటిది బైబులు సమాచారం, రెండవది బైబులు పఠనం, మూడవది భక్తివంతమైన బైబులు పరనం.

1. బైబులు సమాచారం

1. గ్రంథ సంఖ్య

అన్ని క్రైస్తవశాఖలు నూత్న వేదగ్రంథాలు 27 అని అంగీకరిస్తాయి. పూర్వ వేదగ్రంధాల సంఖ్య విషయంలో మాత్రం ఏకాభిప్రాయం లేదు. క్యాతలిక్ శాఖ ప్రకారం పూర్వవేద గ్రంథాలు 46. కనుక బైబులు గ్రంథాలు మొత్తం 73. ప్రోటస్టెంటు శాఖల ప్రకారం పూర్వవేద పుస్తకాలు 39. బైబులు గ్రంథాలు మొత్తం 66 మాత్రమే.

ఈ వ్యత్యాసం ఏలా వచ్చింది? హీబ్రూ పూర్వవేదంలో 39 పుస్తకాలు మాత్రమే వున్నాయి. ప్రోటస్టెంటు శాఖలు ఈ సంఖ్యను అంగీకరించాయి, హీబ్రూ పూర్వవేదానికి అనువాదమైన సెప్తువాజింత్ గ్రీకు బైబుల్లో మరి 7 గ్రంథాలు అదనంగా జేర్చి మొత్తం 46 పుస్తకాలు చేసారు. ఇది క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో తయారైంది. ఈ యనువాదం కూడ ప్రామాణికమైంది కావడం చేత క్యాతలిక్ శాఖ దీని సంఖ్యను గ్రహించి పూర్వవేద గ్రంథాలు 46 అని శాసనం చేసింది.

సెప్తువాజింత్ బైబుల్లో అధికంగా వున్న గ్రంథాలు ఇవి. తోబీతు, యూదితు, బరూక్, మక్కబీయుల గ్రంథాలు రెండు, సాలోమోను జ్ఞానగ్రంథం, సీరా జ్ఞాన గ్రంథం. ప్రోటస్టెంటులు ఇవి కూడ ఉపయోగకరమైన పుస్తకాలేనని ఒప్పకొంటారు. కాని వీటిని భగవత్ ప్రేరితమైన పుస్తకాలుగా మాత్రం అంగీకరించరు.

2. ప్రేరణం

"క్రీస్తు అనుసరణం" మొదలైన భక్తిమంతమైన క్రైస్తవ పుస్తకాలు చాలా వున్నాయి. వాటికీ బైబులుకీ ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి? బైబుల్లో భగవత్ ప్రేరణం వుంటుంది. ఇతర పుస్తకాల్లో ఈ ప్రేరణం వుండదు. ఈ ప్రేరణంవల్ల బైబుల్లో అమోఘమైన ఫలశక్తి నెలకొని వుంటుంది. గ్రంధాన్ని చదివేవాళ్ళకు ఆశక్తి లభిస్తుంది. కలాన్ని సాధనంగా వాడుకొని జాబు వ్రాస్తాం. అలాగే భగవంతుడు పరిశుద్ధ రచయితను సాధనంగా వాడుకొని వాళ్ళచేత దివ్యగ్రంధాలు వ్రాయించాడు. ఇదే ప్రేరణం - 2 పేత్రు 1, 21. దివ్యగ్రంథాల్లోని భావాలు దేవునివి కనుక వాటి ప్రధాన రచయిత