ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

భోజరాజీయము ఆశ్వా 7


బాచతురాస్యముఖాఖిల
ఖేచర మగుఁగాత నాదు కృతిరత్నము దాన్.

178


సీ.

అఖిలజగత్సేవ్యమై భూమిపై నహో
బ లము దా నెందాఁక వెలయుచుండు
నాతీర్థమందుఁ బ్రఖ్యాతమై భవనాశ
       నీనది యెందాఁక నెగడుచుండు
నామహానదిపొంత నత్యంతపూజ్యమై
       గరుఁడాద్రి యెందాఁకఁ గదలకుండు
నయ్యద్రిశిఖరంబునందును నెందాఁక
       శ్రీనృసింహస్వామి స్థిరత నుండు


ఆ.

నస్మదీయకృతియు నందాఁక సంతత
శ్రావ్యమై సమస్తసభలయందు
విస్తరిల్లుఁ గాత వివిధకథానూత్న
రత్నభూషణాభిరామ మగుచు.

179


క.

గోవులకును బ్రాహ్మణులకు
భూవలయములోని పుణ్యపురుషులకు నఖీ
ష్టావాప్తి యొదవుఁ గావుత
దేవార్చితుఁడగు నృసింహదేవుని కరుణన్.

180


చ.

అని జగదేకవంద్యునకు, నాదినృసింహున, కిందిరామనో
వనజమధువ్రతేంద్రునకు, వారిజనాభునకున్, సరోజలో
చనునకు, సూరిలోకనుతచర్యునకున్, భవబంధజాలమో
చనునకు నేను నీవిమలసత్కృతి కానుకగా నొనర్చితిన్

181


క.

నన్ను భవద్భృత్యులలో
నెన్ని దయాదృష్టిఁ జూచి యిది మొదలుగ నీ
వెన్నఁడు వదలకు మిది నా
విన్నప మట్లైన నఘనివృత్తుఁడ నగుదున్.

182


చ.

సరసిజపత్రనేత్ర! భవసాగరబాడబవీతిహోత్ర ! ని
ర్జరపరిచార! ధాత్రిచరసంఘవిదార! విఘాతపాతకో