ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

భోజరాజీయము ఆశ్వా 7


క.

విప్రుఁడ నే, నయ్యంత్యజుఁ
డాప్రమథాధిపతిభక్తుఁ డాతఁడు తనధ
ర్మప్రాభవమున నియ్యెడ
నప్రతిహతతేజుఁడై హరాద్రికిఁ బోయెన్.

146


క.

వినుఁ డతనిమహిమ చెప్పెద
నని తన కాశీప్రయాణమాదిగ మఱి యా
తనిమోక్షము తుదిగాఁ గ
ల్గునడిమివృత్తాంత మెల్లఁ గొనకొని చెప్పెన్.

147


ఉ.

చెప్పినఁ బ్రీతులై యతనిఁ జెచ్చరఁ దోఁకొని పోయి బూరెలుం,
బప్పును, నెయ్యి, పాయసముఁ, బక్వఫలాదులు నేత్రతృప్తిగా
గుప్పిరి మున్ పథశ్రమము గూరినమేనికి దప్పి దీఱున
ట్లప్పురవిప్రముఖ్యులు; ప్రియంబునఁ గైకొని యేఁగె నాతఁడున్.

148


వ.

ఇ ట్లేఁగి తనపురంబు చేరి యాత్మగతంబున.

149


ఉ.

కాశికిఁ బోవఁ గంటి, మణికర్ణికఁ గ్రుంకిడఁ గంటి నేను, వి
శ్వేశుపదాబ్జసేవఁ బరమేశ్వరిసత్కృపఁ జాలఁ గంటి, న
క్లేశగతిన్ హిమాచలము క్రిందటి భూములు చూడఁ గంటి, న
చ్చో శిశువక్త్రజంబు లగు సూక్తు లొగి న్వినఁ గంటిఁ దేఁటగన్.

150


ఆ.

అక్కజంబులైన యట్టివిశేషంబు
లర్థిఁ జూడఁ గంటి నచట నచటఁ;
దిరిగి వచ్చి జన్మదేశము చొరఁ గంటి
మంటి ననుచు నాతఁ డింటి కరిగె.

151


క.

భయభ క్తిసంభ్రమంబులు
రయమున ముప్పిరి గొనంగఁ బ్రణమిల్లినయా
ప్రియసతి నుచితవచనసం
చయములఁ దగ గారవించి సౌహార్దమునన్.

152


ఉ.

ఇమ్ములఁ గాశికాపురికి నేఁగెడునప్పుడు, నందునుండి య
య్యమ్మికపంపునన్ హిమవదద్రిసమీపము కేఁగునప్పుడున్,