ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పావకలోముని కథ

131


శోకించుచుఁ జని చెప్పి మ
హీకాంతున కంతపట్టు నేకాంతమునన్.

140


క.

ఇప్పని యుక్తము గాదని
యప్పడుచుకు బుద్ధి చెప్పి యదలుపకున్నన్
ముప్పగునని యడిచిపడుచు
నప్పుడ చని కూఁతుతోడ నజవక్షుఁ డనున్.

141


ఉ.

'ఆదిక దెచ్చుకొంటి, తగునమ్మ? తనూభవ! యట్టులైన నీ
తోడికుమారికల్ నగరె, ధూతకళంకునిఁ గుంభి నొల్ల కే
వాఁడొ యెఱుంగ మాతనిని వల్లభుఁ డందువు తప్పు గాదె, నా
తోడు మదీయబుద్ధి విను, దుఃఖముగట్టకు మాకు ముప్పునన్'

142


ఆ.

 అనినఁ దండ్రిఁ జూచి యనుమతి యిట్లను
'నేటిమాట లాడె దెఱుకమాలి
నీకుఁ గుంభిగాని నాకు వాఁడయ్యమే
ధ్యంబులోని క్రిమివిధంబు సుమ్ము.

143


క.

ఈరాజకుమారుఁడు దను
గారవమునఁ బెనుపఁ బెరిగి కడుఁ గ్రొవ్వి కదే
వారక వాఁ డిటు చేసెను
మీ రీమొద లెఱుఁగ రివియె మీదు విమర్శల్.

144


క.

మీతో నాఁడును జెప్పనె,
పాతకుఁడగు కుంభిమాట పాటిగఁ గొని మీ
రాతని నుపేక్ష చేసితి
రాతఁడు కీడ్పఱిచె నితని నన్యాయమునన్.

145


తే.

రాష్ట్రముననైనపాపంబు రాజుఁ బొందు;
క్షితిపుపాపంబు మఱి పురోహితుని బొందు;
మగువచేసినపాపంబు మగనిఁ బొందు;
శిష్యుపాపంబు గురుఁ బొందు సృష్టియందు.'

146


క.

అని తన్నుఁ దూల బల్కిన
యనుమతిమాటలకుఁ గలఁగి యజవక్షుడు ము