ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదనరేఖ కథ

105


చేత నైనను నుపదేశంబు గొనుము "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం”
బనుట వినవే' యనినఁ జెవులు మూసికొని యతండు 'తల్లీ! నీ విట్లాన
తిచ్చుట యుచితంబె, భవత్సాన్నిధ్యంబు నాభాగ్యవిశేషంబునం బొడమె, నా
యెఱుకతీఁగె సుడివడకుండ నీవిమలవాక్యజాలం బను ప్రాఁకువెట్టి ప్రోది
సేయుదు గాక, యుపేక్షించుట రక్షకుల లక్షణంబె? ' యనిన నాదనుజేంద్రు
నకు మనుజేంద్రనందన యి ట్లనియె.

183


క.

రక్కసు లెక్కడ ధర్మం
బెక్కడ యేయూరి కరయ నేత్రోవ మనం
బెక్కడికి నీడ్చె నీడ్చిన
యక్కడి కరుగంగనైన య ట్లయ్యెఁ దుదిన్.

184


క.

అది గాక ధర్మమార్గము
వదలక చనుబుద్ధి నీకు వాలాయంబై
యొదవిన నెట్టనఁ దగఁ జె
ప్పెద విను' మని చెప్పఁ దొడఁగె బింబోష్ఠి యొగిన్.

185


ఉ.

బొంకకు మెన్నఁడున్ దనుజపుంగవ! శాంతివహించి యుండు, మే
వంకను జీవబాధ లగువాని నొనర్పకు, శౌచివై గతా
హంకరణుండవై ఘనదయామతివై విజితేంద్రియుండవై
పంకజనాభదివ్యపదపంకజభక్తిపరాయణుండవై.

186


ఉ.

నెమ్మది నుండు, నీకు నిది నేమ, మిహంబుఁ బరంబుఁ గోరువా
రిమ్మహి నెవ్వరేనిఁ బరమేశు రమారమణీశు యోగిహృ
త్సమ్మతు సర్వలోకహితు సచ్చరితు న్మదిఁ గొల్వ రట్టివా
రెమ్మెయి నైనఁ గానఁగలరే కలదే మఱి దిక్కు వారికిన్?

187


క.

హరిభక్తివిరహితుం డగు
నరుఁ డసురాంశంబువాఁ డనంగను విందున్
హరిభక్తి గల్గె నేని న
సుర యైనను దేవతాంశజుం డనఁ బరగున్.

188


వ.

తొల్లి ప్రహ్లాద విభీషణాదు లగు నసురపుంగవులు హరిభక్తినిరతు లగుటంజేసి
యెం తెంత వా రైరి, వారి నిప్పుడు రాక్షసు లనవచ్చునె, వైష్ణవధర్మంబునకు