ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదనరేఖ కథ

103


నేవిధిఁ ద్రోచువాడఁ బరమేశ్వర! మారవికార మెత్తి యా
త్రోవకుఁ జొచ్చితి న్మొదల, దోషముగాఁ గొని యిప్పు డోడెదన్.'

158


చ.

అనుచు నృపాలపుత్రి వదనాబ్జము గారవ మొప్పఁ జూచి 'మ
జ్జనకుఁడు నీగురుండగుటఁ జామ! సహోదరి వీవు నాకు, నే
రనీపని చేసి నాఁ డటులు రాగ మెలర్పఁగ నిన్నుఁ గొంగు వ
ట్టినదురితంబు వాయుటయె దెప్పర మైనది యంత చాలదే.

159


క.

నీ పంతము చెల్లించితి
నీపతికడ కేఁగు మింక నీ సూనృతని
ష్ఠాపారీణత జగమున
దీపించుం గాక సంస్తుతికిఁ బ ట్టగుచున్.

160


క.

అని దీవించిన నవ్వుచు
వినయంబున మ్రొక్కి యతని వీడ్కొని వేడ్కన్
జనుదెంచె బాల యే లొకొ
చని రా దని దనుజుఁ డాత్మ సంశయపడఁగన్.

161


వ.

అట్లు చనుదెంచిన యారాజపుత్రి నిర్వికారభావంబు నిరీక్షించి యారాక్షసుం
డి ట్లనియె.

162


ఆ.

'తావి గొనని పుష్పదామంబువిధమునఁ
జిదుమఁ బడని మావిచిగురు భంగిఁ
ద్రావఁ బడని నవసుధాధార పగిదిని
జెలువఁ జూడ సురతచిహ్న లేదు.

163


క.

ఇతరు లెఱింగినఁ దిరిగితొ,
యతఁ డచ్చట లేఁడొ, నీకు నతనికి మాటల్
గతి గూడక యుండిన వ
చ్చితొ, యంతయు నున్నరూపు చెపుమా నాకున్.'

164


వ.

అనిన నయ్యసురకు నబ్బిసరుహనేత్ర యి ట్లను 'నీ విప్పుడు చెప్పినయంత
రాయంబు లెవ్వియు లేవు. మద్భాగ్యనిమిత్తంబున నతనిచిత్తంబు ధర్మా
యత్తం బగుటయు నా వెఱ్ఱి దిరిగి సహోదరింగా నన్ను మన్నించి మర
లించిన నీయాఁకలి తీర్చుటకు నతిత్వరితంబున నిట కేతెంచితి.

165