ఈ పుటను అచ్చుదిద్దలేదు

85

బా ల నీ తి.

(ఢిల్లీ)కు జని కుందుచు నిద్రాహారముల విడనాడి కృశించుచుండెను. అంత నాతని యాంతరంగిక మిత్రుడును, మేనమామయునగు శకుని తనయల్లుని జూచి "సుయోధనా! నీవేల యిటుల గృశించుచు న్నావు? కారణము దెల్పుమనియడిగెను. అంత నారాజరాజు "మామా! ఆధర్మరాజుసభావిభవంబును, నధ్వరముయొక్క తుదిదినమున నతడధ్వర్యులకు దక్షిణలొసంగి సత్కరించినపిమ్మట,ధర్మజ్ఞలగు ధౌమ్యాదులా సభయం దాయుధిష్టరుని నవరత్నఖచిత సింహాసననాసీనుగావించి వివిధ దేశాగతరాజు లాయజాత శత్రునకు దెచ్చినరత్నములు, మణులు, ఏనుగులు,గుఱ్ఱములు, కాల్బలము, మొదలగుగొప్ప గొప్పకానుకల నాయారాజులచే సమర్పింపజేయుచు జనులందఱు జయజయధ్వనులు సేయుచుండం రారాట్టనుపేరుతో నుండిననేను జూచుచుండ బట్టాభిషిక్తుని జేసిరి. అహా! ఏమివానివైభవము, మఱియు నతడు నన్ను రత్నపరిగ్రహణమందుని చెను. ఆధర్మరాజుయొక్క సదనము రత్నాకరమన జెల్లు.ఆవైభవమంతయు నేగనులార జూడలేక వీనులార వినలేక నిక్కముగా నిటులగృశించుచు న్నాను. అతనిసంపదనంతయు నేంబొందినపుడు సుఖముగా నుండగలను. కాన దీనికిదగిన యుపాయమాలోచించుమని పలికెను. అంత నాశకుని విచారించి తనయల్లునితో "వారిసంపదంతయు బొందుటకు మాయాద్యూతమె సాధనము. కాని దీనికి మీతండ్రి సమ్మతింప వలయు"