ఈ పుటను అచ్చుదిద్దలేదు
32

బా ల నీ తి.

ర్తియై యతడు కాడని దృఢముగా జెప్పెను. అంతట నామునులిద్దఱికి గలహముక్రమముగాబెరిగెను. అంత నిద్దఱు కొన్నిపంతముల నేర్పఱచుకొనిరి. విశ్వామిత్రుడు తన పంతము గెలువవలయునని యనే కోపాయములాలోచించి యింద్రునివీడ్కొని హరిశ్చంద్ర మహారాజుదరికివచ్చి "నేయజ్ఞముచేయదలచిగాన నీవు నాకేనుగుపై నెక్కి గవ్వబైకెగరవేసిననెంత యెత్తుండునో యంతయున్నతముగల ధనరాశి నిప్పింపవలయు" ననికోరెను. దానికారాజంగీకరించి ధనము నిచ్చివేసెను. అంతనాగాధేయుడు తిరిగి యారాజుసమీపముననే యాయర్దమునుంచెను. అంత నారాజీవిశ్వామిత్రుని సంభావించి పంపించెను. తరువాత నీముని తన యాశ్రమమున కరిగి దుష్టమృగ ములను సృజించి యారాజును దనసమీపమునకు రప్పించుకొనెను. మాతంగకన్యల నుసృష్టించి యధర్మంబునకు బాల్పడి మమ్ము వివాహమాడుమని కోరుండనిచెప్పియారాజు సమీప మునకు వారిని బంపీంచెను. వారామునివచించినటు లనే యారాజును వివాహమాడగోరిరి. అంత నారాజ ధర్మంబని తఱిమివేసెను. ఆసంగతి నీముని విని, కునిసి, యదలించి, మాయోపాయమున నాతనిచే రాజ్యము దానముగాగైకొని యారాజుని సకుటుంబ ముగా గాననమునకంపెను. మఱియు దానిదివఱకు దాచుకొనియున్న ధనమును దీసికొనివచ్చుటకై వారి వెంట "నక్షత్రకుడను తనశిష్యుం బంపెను. ఆనక్షత్రకు డనేకధంగులవారిని గష్టపెట్టెను. దాని కీర్తా