ఈ పుటను అచ్చుదిద్దలేదు

బా ల నీ తి.

కాని వేఱొకరుగానరారు. మనకెట్టిల్య్లిక్కట్టులు వచ్చినను నవితోలగు నుపాయమాలొచించి చేతనయి నంతవఱకు వానిని దొలగించుచుండును. "పిల్లి తన పిల్లల నెక్కడ నెప్పుడు గండుపిల్లివచ్చి చంపునో" యనుభవముచే సందులగొందుల వానిని దాచ్విపెట్టుట మనముచూచుటలేదా? కాబట్టి తల్లి కున్నప్రేమ యితరులకు లేదనిచెప్పవచ్చును. అట్టితల్లుల యందు భక్తిగానుండుట మనకు విధ్యుక్తధర్మముకాదా. అది గాక "మాతృదేవోభవ" అనగా "దల్లియేదైవముకలవాడనై కమ్మా" యని యుపనిషత్తులు చాటుచున్నవి. మఱి యు "నమాతు: పరదైవత" మ్మనగా "దల్లికంటె నితరదైవములే" దని శాస్త్రము నుడువుచున్నది. కాన మనలను వృద్దికిదీసికొనివచ్చిన తల్లులయందు భక్తిగా నుండవలెను. వారికేవిధమైన బాధలుండినయెడల ననుకొనని ప్రయోజనములను హఠాత్తుగా బొందగలము.

అటుల మాతృభక్తికలిగి యాకస్మికముగా లాభములబొందువారును బూర్వులలో గలరు. వాఐలొనొకరి కధ జెప్పెద.

మున్ను కశ్యపబ్రహ్మవరమున "వినత" యను తరుణీ రత్నమునకు గరుడుడనువాడొకడు జనించెను. అతడు మహాజన సత్వసంపన్నుడు. అట్లయ్యు నాగరుత్మంతుడు తనతల్లియనుమతిని, దనసవతితల్లియగు కడ్రువయొక్క కుమారులగు పాములను మోయుచుండెను. ఇటులుండ నాతని