ఈ పుట ఆమోదించబడ్డది

162

కాచి త్రాగవలెను. అప్పుడు నీటిలో నున్న బూదకాలు సూక్ష్మ జీవులు చచ్చి పోవును. ఒక ప్రదేశము నందు ఈ వ్యాధి మిక్కుటముగ వ్యాపించి యున్న ఎడల ఆ ప్రదేశమునకు దూరము లోనున్న చెరువు నుండి దోమల సంపర్క మేమియు కలగ కుండ గొట్టముల గుండా నీరు తెప్పించు కొనవలెను. చెన్న పట్టణములో నిప్పుడిట్లు చేయుట వలన బూద కాళ్లు చాల వరకు తగ్గి పోయినవి.