ఈ పుట ఆమోదించబడ్డది

146

మూత్రము, వాంతి, కఫము మొదలగు పదార్థములందలి సూక్ష్మ జీవుల నశింప జేయుటకు ఇది పెట్టిన పేరు. సామాన్యముగ నూటికి ఒక పాలు సౌవీరమును, 10 పాళ్లు ఉప్పును, 89 పాళ్లు నీళ్లును చేర్చి యొక ద్రావకముగ జేసి దానిని నిలవ ద్రావకముగ నుంచుకొని దానిలో నూటికి పది లేక ఇరువది పాళ్లు నీళ్లు చేరు ఒకటికి వేయి వేయి లేక రెండు వేల పాళ్లుగల ద్రావకముల నప్పటి కప్పుడు తయారు చేసికొని ఉపయోగించు కొనవలెను. లేదా మనకు కావలసిన పాళ్లతో ద్రావకము నెప్పటి కప్పుడు తయారు చేసి కొనుటకై యేర్పడిన రకరకముల మాత్ర లిప్పుడు అమ్ముచున్నారు. వానిని గూడ ఉపయోగించ వచ్చును. ఇది ప్రబలమైన విషయమని మాత్రము మరవ కూడదు. ఇందు పాదరసము చేరి యున్నది. ఇది లోహ పాత్రములను చెరిచి వేయును. సబ్బు నీళ్లను ఇది విరిచి వేయును.

4. తుత్తినాగ హరిదము.(జింక్ క్లోరైడ్) ఇది నూరు పాళ్ళ నీటి కొకటి చొప్పున చేర్చినను సూక్ష్మ జీవుల పెంపును అణచి వేయును. నూటికి 2 మొదలు 5 పాళ్లవరకు చేర్చిన సామాన్యముగ అన్ని సూక్ష్మ జీవులను చంపును. ఈ ద్రావకముల వలన బట్టలు గాని, ఆయుధములు గాని లోహ పాత్రములు గాని చెడిపోవు.

5. గంధకము, గంధకమును కాల్చుటచే వచ్చు పొగ సూక్ష్మజీవులను చంపుటలో మిగుల శక్తి గలది కాని ఇది తడితో