పుట:Annamacharya Charitra Peetika.pdf/84

ఈ పుటను అచ్చుదిద్దలేదు

82 హరి నీకృపకలిమి నట్లనే యురులచే ! కరఖడ్గధార నాకుఁ గలువదండాయ |నాఁటి 1 మునుపు హరిశ్చంద్రుమొనకత్తిధార దొల్లి - పొనిఁగి చంద్రమతికిఁ బూవుదండాయ | వనజాక్ష నీకృపను వరశత్రులెత్తి నట్టి ! ఘనఖడ్గధార నాకుఁ గసూరివాటాయ నాఁటి| 2 చలపట్టి కరిరాజు శరణంటె విచ్చేసి కలుషముఁ బెడఁ బాపి కాచినట్టు 1 అలర శ్రీవెంకటేశ ఆపద లిన్నియు బాపి | ఇల నన్నుఁగాచినది యెన్నఁ గతలాయ నాఁటి 3 ఈ కీర్తనమునఁ జెవ్పఁబడినదే కాక (వుట. 286 వుట) సంకీర్తనమున వర్ణితమయిన విషయములుగూఁడఁ బెదతిరుమలాచార్యుని మాహాత్మ్యమును వెల్లడించుచున్నవి. ఆసంకీర్తనమును జినతిరుమలా చార్యుఁడు రచించియుండఁ బోలును. అచ్యుతరాయలవారు వూండి, నంగవుకోట గ్రామములఁ దామ్రాశాసన పూర్వకముగా దానము Šostocnoc బెదతిరుమలాచార్యుడు వానిని స్వామికే సమర్పించెను. ఆతఁ డచ్యుతరాయల జన్మనక్షత్రము నాఁడు తనద్రవ్యముతో స్వామికిఁగైంకర్యములఁ గల్పించెను. అచ్యుతరాయలనాఁ డాతఁడు విజయనగరములో విట్టలేశ్వరస్వామి కైంకర్యముల కై గొప్పభూ సమర్పణము చేసిను. పెదతిరుమలయ్య స్వామికి అర్పించిన గ్రామములు:- కావనూరు, మరువాకరై, కుప్పము, కీళంగుస్రము, మన్నసముద్రము, పూండి, సంగమకోట, (ఈ రెండూళ్ళ నంవత్సర వు రాబడి 1000 రేఖ పొన్నులు) రాయులపాడు, సోమయాజులపల్లి, కత్తమువారిపల్లి, ఎఱ్ఱగుంటపల్లి, పల్లిపురము, (133 వరాహాల సంవత్సరాదాయముకలది.) గండతిమ్మాపురము (100 oථිඟු పొన్నులు సంవత్సరాదాయముగలది.) ఈ గ్రామములుగాక-భిన్న భిన్న సమయములలో 4600 పణాలు 5203 పణాలు 2000 వరహాలు 450 వణాలు 1900 వణాలు 1020 నర్పణాలు 2300 నర్పణాలు సమర్పించినారు.