పుట:Andrulasangikach025988mbp.pdf/432

ఈ పుట ఆమోదించబడ్డది

కాకతీయుల యగము

ఒకచుక్క, ఒదానిపై రెండు, మూడవదానిపై మూడుచుక్కలుండును. ఇద్దరాడుదురు. తలా 6 కాయలుండును.

ఒకరు కుడినిండి ఇంకొకరు ఎడమనుండి కాయలు వడుపుదురు. మహాభారత యుద్ధకాలమునను. వేదకాలమునను ఆడిన పాచికలయాట దీనికి భిన్నించినట్టిది. వేదమందును, పురాణములుందును. ఈయాటను అక్షఖేలనమనిరి. పాచికలపై చుక్కలు కన్నులవలె నుండుటచే ఆక్షలని వాటికి పేరువచ్చెను. విభీతకము (తాండ్ర) చెట్టుయొక్క కట్టెతో పాచికలు చేసేడివారు. వేదములో కవష బలూష అను శూదర్షి తన కలమందలి జనులలో ఎక్కువగా వ్యాపించిన యీదుర్వ్యసనముము ఖండించినాడు. (చూడుడు ౠగ్వేదము, మం. 10 నూ 34 ). పూర్వకాలపు సారెలపై నాలుగు దిక్కులలో ఒక దిక్కు ఒక్క చుక్క, రెండవదిక్కు రెండు, మూడవదిక్కు మూడు, నాల్గవదిక్కు నాల్గు చుక్కలుండెడివి. ఒక్క చిక్కకలి, రెంటికి ద్వాపర, మూటికి త్రేత, నాల్గింటికి కృత అను యుగనామ సంకేతము లుంచిరి. ప్రాచీనము నిండి నేటివరకు జనుల వినోదఖేలనములలో సంఖ్యలకు మారు పేరులు పెట్టుట