అ కాలమందు బ్రాహ్మణులు సంస్కృతాభ్యాసము విరివిగా చేయుచుండిరి. వారి పాఠ్య ప్రణాలిక యేమనగా, మేఘ సందేశము, కువలయానందము, ప్రబోద చంద్రోదయము, మణిసారము, సిద్దాంతకౌముది, రసమంజరి, కావ్యప్రకాశిక మొదలగునవి.
మనవారు ఇంగ్లీషు విద్యాపద్దతులలో నిండుగా మునిగినది. ఈ 60 ఏండ్లలో, అంతకు పూర్వము మన దేశపు బళ్ళస్థితిని నారాయణకవి ఇట్లు చక్కగా వర్ణించినారు.
నన్నయ్యవార లోనామాలు దిద్దుకొ
మ్మనినచో కడుపునొప్పనుచు నేడ్చి
దండంబునను గుణింతము పెట్టరమ్మన్న
అంగుళీ వ్రణమాయెననుచు జుణిగి
శిష్యులచే గాలుసేతులు బట్టించి తెచ్చి
పద్యముజెప్ప దెమలకుండి
పలక వ్రాయనటంచు బడికెత్తుకొనిపోవ
బలపంబులేదని పలుకకుడి
అలుకచేనుండ బుగ్గలుమలిచి తిట్టి
తొడలు వడిపెట్టి కోదండమడరగట్టి
రెట్టలెగబెట్టి బట్టించి రేపుమాపు
కొట్టుబెట్టుగ సజ్జల కోలదెగను (3-141)
గద్దించి తిట్టిట దిద్దుమంచును వ్రేలు
బట్టించినచటనే బట్టకుందు
పలుమారు లోయని పల్కుమంచునుగొట్టి
చెప్పిన శిలవృత్తి దప్పకుందు
ఒకటికి సెలవియ్యనురికి చీకటిదాక
పసులగాపరుల వెంబడినపోదు
జనని ఆడుక్కొని చదువుకోబొమ్మన్న
వినక వేమరు వెక్కి వెక్కి యేడ్తు
సారెపద్యపు బలుక పై చమురుపూతు
ఎప్పుడును పెద్దపలక పొక్కెత్తజేతు