పుట:Andrulasangikach025988mbp.pdf/136

ఈ పుట ఆమోదించబడ్డది

         థ్బర భాషల్ కరహాటభాష మరియున్
              భాషావిశేషంబు ల
         చ్చెరువై వచ్చు నరేటి యన్ననికి గో
              ష్ఠీ సంప్రయోగంబులన్.
 
         అన్నయ మంత్రిశేఖరు డ
             హమ్మదుసేను వదాన్య భూమి భృ
         త్సన్నిథికిన్ మదిన్ సముచి
             తంబుగ వేమ మహీసురేంద్ర రా
         జ్యోన్నతి సంతతాభ్యుదయ
             మొందగ పారసీభాష ఱ్రాసినన్
         కన్నుల పండువై యమరు
             కాకితమందలి వర్ణపద్ధతుల్.[1]

ఆ కాలానికే ఫార్సీప్రభావము తెనుగువారిపై ప్రారంభమయ్యెను. శక సింధు సౌవీర బర్బర కరహాట భాషలు వచ్చెననుట అతిశయోక్తియైయుండును. బర్బర అనునది బార్బరీ అను ఆఫ్రికాఖండోత్తర భాగము. తురుష్కభాష అన ఫార్సీ యని యర్థమేమో ! ఆంధ్రుల చరిత్రలో పైపద్యమందు "అహమ్మశాసన దానభూమి భృత్" అని వ్రాసినారు. ముద్రిత భీమేశ్వర పురాణపాఠమే సరిగా నున్నది. అహమ్మదుహుసేను లేక అహమ్మదుషా అనునతడు గుల్బర్గా బహమనీ సుల్తాను.

కవులకు గొప్ప ఆదరణ సన్మానముండుటచే శ్రీనాథుడు.

         "అక్షయ్యంబగు సాంపరాయని తెలుం
              గాధీశ ! కస్తూరికా
          భిక్షాదానము జేయురా ! సుకవీరా
              డ్బృందారక శ్రేణికిన్
          దాక్షారామ చళుక్యభీమ వరం
              దర్వాప్సరో భామినీ
          వక్షోజద్వయ కుంభి కుంభములపై
              వాసించు నవ్యాసనల్."

  1. భీమేశ్వరపురాణము. అ 1. ప 73, 24