థ్బర భాషల్ కరహాటభాష మరియున్
భాషావిశేషంబు ల
చ్చెరువై వచ్చు నరేటి యన్ననికి గో
ష్ఠీ సంప్రయోగంబులన్.
అన్నయ మంత్రిశేఖరు డ
హమ్మదుసేను వదాన్య భూమి భృ
త్సన్నిథికిన్ మదిన్ సముచి
తంబుగ వేమ మహీసురేంద్ర రా
జ్యోన్నతి సంతతాభ్యుదయ
మొందగ పారసీభాష ఱ్రాసినన్
కన్నుల పండువై యమరు
కాకితమందలి వర్ణపద్ధతుల్.[1]
ఆ కాలానికే ఫార్సీప్రభావము తెనుగువారిపై ప్రారంభమయ్యెను. శక సింధు సౌవీర బర్బర కరహాట భాషలు వచ్చెననుట అతిశయోక్తియైయుండును. బర్బర అనునది బార్బరీ అను ఆఫ్రికాఖండోత్తర భాగము. తురుష్కభాష అన ఫార్సీ యని యర్థమేమో ! ఆంధ్రుల చరిత్రలో పైపద్యమందు "అహమ్మశాసన దానభూమి భృత్" అని వ్రాసినారు. ముద్రిత భీమేశ్వర పురాణపాఠమే సరిగా నున్నది. అహమ్మదుహుసేను లేక అహమ్మదుషా అనునతడు గుల్బర్గా బహమనీ సుల్తాను.
కవులకు గొప్ప ఆదరణ సన్మానముండుటచే శ్రీనాథుడు.
"అక్షయ్యంబగు సాంపరాయని తెలుం
గాధీశ ! కస్తూరికా
భిక్షాదానము జేయురా ! సుకవీరా
డ్బృందారక శ్రేణికిన్
దాక్షారామ చళుక్యభీమ వరం
దర్వాప్సరో భామినీ
వక్షోజద్వయ కుంభి కుంభములపై
వాసించు నవ్యాసనల్."
- ↑ భీమేశ్వరపురాణము. అ 1. ప 73, 24