ఈ పుట ఆమోదించబడ్డది
హనుమంతరావుపంతులుగారికి గృతజ్ఞతావందనములు చెప్పుచున్నాను.
మరియు నీ చరిత్రమును ముద్రించెడి శ్రీజ్యోతిష్మతీ ముద్రాశాలాధికారులును విద్వత్కవి సింహులునైన బ్రహ్మశ్రీ వేదము వేంకటరాయశాస్త్రులువారు శాసనములలోని యనేక సందిగ్దాంశములను దెలిపియు, అపరిశుద్ధములై యున్న శ్లోకములను దిద్దదగినపట్ల దిద్దియు, వాని భావములను దెలిపియు ననేక విధములుగా దోడ్పడినందులకును నేను గ్రంథమును త్వరగా ముగింపక కాలయాపన చేయుచున్నను ఓపిక వహించి గ్రంథమును ముద్రింపజేసినందులకును, వారికిని, శాసనములం జదువుటయందు దోడ్పడిని బ్రహ్మశ్రీ చెన్నాప్రగడ భానుమూర్తి పంతులు, బి.ఏ., గారికిని మనఃపూర్వకములైన యనేక వందనములాచరించుచున్నాడను.
చెన్నపురి.
30-5-1912.
ఇట్లు విధేయుడు
చిలుకూరి వీరభద్రరావు.