ఈ పుట ఆమోదించబడ్డది

ఈపూట హరిహరీ! యేపాట గడచునన్

దారిద్ర్యభీతి యింతయును లేదు

రాము దలపజేయు నామయం బుండగ

సౌఖ్య మరయుపొంటె జాయ యుండ

నింతవలను గలుగ నిప్పుడ శ్రీరాము

దలపకున్న నెపుడు దలచువాడ

(శ్రీరామాయణ పీఠిక)


రామాయణ రచనమున వీరి యుద్దేశమిది. వీరు యావజ్జీవమును గోదండరామస్వామికే ధారవోసిన భక్తులు. ఆ యాలయము పునరుద్ధరించుటకు వీరుతెనుగు నాడు పర్యటించి పెక్కువేల ధనము సంపాదించి భగవదర్పితము గావించిరి.

పాపము! సుబ్బారావుగారికి జిన్ననాటనే పితృవియోగము సంభవించినది. పినతండ్రి లక్ష్మణరావుగారి పెంపకమున విద్యాబుద్ధుల గఱచి పెద్ద చదువు చదివిరి. పదునొకండు సంవత్సరములు కడపమండలమున రెవెన్యూ ఇనస్పెక్టరుగా బనిచేసి, చెన్నపురి సర్వకళాశాలలో బ్రధానాంధ్రపండిత పదవి నలంకరించిరి. పుష్కలముగా ధన మార్జించిరి. చేతులార వర్థులకిచ్చుకొనిరి. ఒక ఆంధ్రవాల్మీకి రామాయణమేగాక వీరివి పేరు తెచ్చుకొన్న కబ్బములు కుమారాభ్యుదయము, కౌసల్యా పరిణయము, సుబద్రావిజయము మున్నగునవి కొన్ని యున్నవి. వీరి సులభవ్యాకరణము వజ్జల చినసీతారామశాస్త్రి ప్రభృతులు మెచ్చుకొనిరి. ఈయన వచనకృతు లెన్నో పాఠ్యములుగా నున్నవి.


కడపకును నందలూరునకును పడమనున్న పల్లెటూరు ఒంటిమెట్ట. కోదండరామస్వామి యాలయ మిచటనే యున్నది. ఈరామస్వామికే--------------------. ఈరామస్వామికే వా.సు దాసు-----------------------------------------

(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు) ______________