పుట:AndhraKavulaCharitamuVol2.pdf/238

ఈ పుట ఆమోదించబడ్డది

క. గురురాయపట్టభద్రుని
   నరిహరు శ్రీరంగనాయకాంశభవున్ భ
   ట్టరు చిక్కాచార్యుని మ
   ద్గురు దలచుచు నడుగులకు నతు ల్గావింతున్.

ఇతడు 1620-30 సంవత్సరప్రాంతములయం దుండినవాడు. ఈరామకవి తన చతుర్వాటికా మహాత్మ్యములో,


సీ. శ్రీవల్లభోపేంద్రదేవేంద్రజనక కశ్యపౠషిగోత్రాబ్ధిచంద్రు డగుచు
   వృద్ధకుండికపొంత వెలయులింగముగుంట నేకభోగముగాగ నేలినట్టి
   చెన్నయామాత్యుని శ్రీరామమంత్రినందను డన్నపకును దద్ధర్మపత్ని
   కమ్మలమ్మకు సుతుడనుసంభవుండుతిమ్మనకుగాదనకు గస్వనకు బెద్ద


   భవ్యభాగీరథీసతీప్రాణవిభుడు
   ఘనులు బస్వన రామ లక్ష్మణులతండ్రి
   మహితవిద్యుండు మత్పితామహుడు నైన
   సర్వకవిసార్వభౌముని సన్నుతింతు.

తనపితామహుడును గవి యైనట్టు స్తుతించి యున్నాడు. ఇతడు యాజ్ఞవల్క్య నియోగిబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; లక్ష్మయామాత్యపుత్రుడు. ఈతని కవిత్వము నిర్దుష్టమయి రసవంతముగా నున్నది. చతుర్వాటికామాహాత్మ్యములోని కొన్ని పద్యము లిందు బొందుపఱుపబడుచున్నవి-


ఉ. చీటికిమాటికిన్ సకలసీమల గ్రుమ్మరుచున్ శ్రమంబునన్
   బాటిల నేల దర్శనవిపాటితకల్మషకోటికిం జతు
   ర్వాటికి నేగి రామున కవశ్యము మ్రొక్కుచు ముక్తి కామినిన్
   జేటిక జేయగా వలదె సిద్ధమనోరథుడై నరుం డిలన్. [ఆ.1]


మ. తలపం బూర్వభవంబునం దెచట నేదానంబు లీగంటినో
    విలసద్భావులు దానపాత్రులు మహావిద్యానిధుల్ మీరు ముం