శా. వీరశ్రీనరసింహ శౌరి పిదపన్ విశ్వక్షమామండలీ
ధౌరంధర్యమున స్జనంబు ముద మంద న్నాగమాంబాసుతుం
డారూడోన్నతి గృష్ణరాయడు విభుండై రాజ్యసింహాసనం
బారోహించె విరోధులు న్గహనశై లారోహముం జేయగన్. [పారిజాతాపహరణము]
శిలాతామ్రశాసనాదులవలన దెలియవచ్చెడు పయివిధమునగాక యీ వంశవిషయ ముయి పలువురు పలువిధముల పరస్పరవిరుద్ధముగా వ్రాసియున్నారు. అందొక విధము నిందుక్రింద గనబఱిచెదను.
మొదలు - వఱకు
హరిహరరాయలు-------------------------1336 - 1350
బుక్కరాయలు---------------------------1350 - 1379
హరిహరరాయలు-------------------------1379 - 1401
విజయబుక్కరాయలు---------------------1401 - 1418
పల్ల బుక్క రాయలు-----------------------1418 - 1434
గౌడదేవరాయలు--------------------------1434 - 1454
రాజ శేఖర రాయలు-----------------------1454 - 1455
విజయభూపతి---------------------------1455 - 1456
ప్రౌడ దేవరాజు----------------------------1456 -1477
వీరప్రతాపరాయలు------------------------1477 - 1481
మల్లికార్జునరాయలు-----------------------1481 - 1487
రామచంద్రరాయలు------------------------1487 - 1488
విరూపాక్షరాయలు-------------------------1488 - 1490
నరసింహరాయలు-------------------------1490 - 1495
నరస రాయలు----------------------------1495 - 1504
వీరనరసింహ రాయలు----------------------1504 - 1509
కృష్ణదేవ రాయలు--------------------------1509 - 1530