గాఢరాగమ్ములో
కాకలీ స్వరముతో
పాడవే గౌతమికి
ప్రణతు లొసగిన పాట!
ఏ పర్వతోద్భవమొ
ఈ వాహినీ మాత
ఏ జడల విడివడెనొ
ఏ సీమ పుణ్యమున
పాడవే గౌతమికి ప్రణతు లొసగే పాట!
ఏ చెలియ గూర్చుకొని
ఏ చెలిమి దలచుకొని
వడినడల చిరునడల
పయనించు కడలికై
పాడవే గౌతమికి
ప్రణతు లొసగే పాట!”
ఆ పాట నానందముతో వినుచున్న రాజకుమారి హృదయము హర్షముచే పులకరించినది. ఏవేవో దూరములు, ఏవేవో భావములు, నపారములై యస్పష్టములై, యా బాలికను దేల్చుకొని పోయినవి. గోదావరిలో స్నానములు, జపములును నాచరించు వారికి గోదావరీమాత రహస్యము లుపదేశించునేమో? కొండ పుట్టిల్లెన నది, కొండలను గూడ ఛేదించుకొని, యెన్నిసీమలు, దేశములు గడచి, రండురఁ' డని సర్వకాలమును నాహ్వానముచేయు సముద్రునిలో లీనమైపోవుచున్నది. “భర్తృదారికా ఈ సాయంతన మంతయు మీ యాలోచనలే మీకు. కాని నేను బ్రక్క నుంటినను మాట మరచిపోవు చున్నారా” యని రాజకుమారిని మాధవి ప్రశ్నించినది. ఆ మాటలకు అంశుమతీ కుమారిని మాధవి ప్రశ్నించినది. ఆ మాటలకు అంశుమతీ కుమారి పక పక నవ్వినది.
చీకట్లు క్రమ్ముకొని వచ్చుచున్నవి. గోవూ రింకను క్రోశపాద మాత్రము దూరమున్నది. గాలి మందగించుటచే నావికులు తెరచాపలను దింపివేసి తెడ్లను వేయ నారంభించిరి, అనుసరించియున్న సైనికుల నౌకలలో బడవ పాటలు ప్రారంభమై గోదావరిపై నెగురు జలపక్షుల కల కలారావములతో సమ్మిశ్రితము లగుచుండెను. ఇంతలో నెట నుండి తారసిల్లినవో పది పదునైదు పడవలు, రాజకుమారి పడవల కెదురై చుట్టి క్రమ్ముకొని వచ్చినవి. ఒక్కసారిగా బిడుగులు పడ్డట్లు రణగుణ ధ్వని ప్రారంభమైనది. “కొట్టుడు! పొడువు” డను కేకలు, పడవను బడవతాకిన చప్పుడు, పరిచారికల యాక్రందనములు, గోదావరీగర్బము గగ్గోలైపోయినది.
రాజకుమారిక నావను నాలుగు పడవ లొక్కసారి చుట్టుముట్టినవి. ఎవరో ముష్కరులు పదిమంది యా నౌకపై కురికిరి. “ఏమిది! ఏమిది!” యని రాజకుమారి
అడవి బాపిరాజు రచనలు - 6
244
అంశుమతి ( చారిత్రాత్మక నవల)