యశోద: బాలిక అవడం ప్రణయం కొరకే
ప్రణయం తెలియని బాలిక ఉంటే
వీరురాలు గంభీరురాలు! అల
మారునైనా తూల్చును వాల్చును
ఎవ్వరు వినినా,
ఎవ్వరు కనినా?
ఇద్దరూ విరగబడి నవ్వుకొన్నారు మంచంమీద దొర్లుతూ ఒకరితో నొకరు మల్లయుద్ధం చెరపుతున్నట్లు, నటించారు. ఆ వెనుక ఇద్దరు లేచి చీరెలు సవరించుకొని, వల్లెవస్త్రములు వయారించుకొని సడలిన స్తనదుకూలాలు బిగించుకొని, రత్నకంబళులపై కూరుచుండి తలకట్లు దువ్వుకుంటూ మాటలాడుకొన ప్రారంభించారు.
“చిట్టివదినా! బోధిశ్రీదేవి, 'యశోదా! నిన్ను తమకు అంగ రక్షకురాలిగా వియోగించుమని భర్తర్తృదారిక ఆజ్ఞ ఇచ్చినారు. అలా ఏర్పాటు చేయకముందు కొన్ని సంశయాలు బాపుకోవాలి. నువ్వు ఏ బాలకునైనా ప్రేమిస్తున్నావా?' అని ప్రశ్నించింది. నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. నిన్నూ ఆ ప్రశ్న అడిగిందా?” అని యశోద తారానిక వంక చూస్తూ అన్నది.
“ఆ, అడిగింది. వదినా! అడిగితే అవునని నిజం చెప్పేసి ఊరు కొన్నను.” తారానిక ఇటూ అటూ పరికించి మరీ చెప్పింది.
“మా అన్నయ్యను ప్రేమిస్తున్నాననే చెప్పితివా ?”
“ఆ!”
“అప్పుడేమంది బోధిశ్రీదేవి?”
“ఏమంటుంది? ఆలోచించి చెబుతానంది.”
“ఎప్పుడూ?”
“ఎప్పుడా? ఆ తర్వాతనట! నువ్వు ఆమె ప్రశ్నకు ఏమి ప్రత్యుత్తరమిచ్చావు?”
“నేను ఎవ్వరినీ ప్రేమించటంలేదని, నీవూ మా అన్నయ్య ప్రేమించుకోవడం తెలుసుకుని, అడిగిందేమో ఈ ప్రశ్న!”
“అయితే కావచ్చును. ఈమె మనిద్దరినే అడిగిందా? అందరినీ ఈ ప్రశ్న లడిగిందంటావా?” అని తారానిక ఆలోచనాధీనయై ప్రశ్నవేసింది.
“ప్రేమిస్తే అంగరక్షకత్వానికి అడ్డంవస్తుందని కాబోలు!"
ఇద్దరు బాలికలూ ఏదో ఆలోచనలో మునిగినారు. ఒక విఘటిక గడచినవెనుక యశోదనాగనికను చూచి తారానిక “వదినా! నేను పోయి రాజకుమారి దర్శనం చేసుకుంటాను. ఆమెతోనే మాట్లాడుకుంటాను” అన్నది. యశోదనాగనిక “సరే వెళ్ళిరా! నేను నాగదిలో కూర్చుని ఉంటాను. మన వంతు తరువాతకదా వచ్చేది” అంటూ తన గదిలోనికి వెళ్ళిపోయింది.
తారానిక వెళ్ళి రాజకుమారి దర్శనం అర్థించింది. రాజకుమారి రావచ్చుననీ అనుమతి ఇచ్చింది. తారానిక వెంటనే లోనికిపోయి రాజకుమారి పాదాలకు నమస్కరించి నిలుచున్నది.
అడివి బాపిరాజు రచనలు - 6
145
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)