పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/252

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ అధ్యాయము

231


గ్రాండుజూరీ అని పేరు. సదరు జూరీ సభ్యులలో యెక్కువ మంది ముద్దాయి దోషీయని నమ్మినయడల అటు పైన ముద్దాయిపైన నేర మారోపించి పెద్ద న్యాయాధిపతి యెదుట విచా రణ జరుగును. ఆ విచారణలో ఉభయపక్షమల సాక్ష్యుములు విచారించి ముద్దాయి నేరస్తుడని తీర్మాన మైనచో ముద్దాయికి శిక్ష విధింపబడును.


పతి విచారణలోను నేరము రుజు వైనవేతప్ప ముద్దాయి నిర్దేషియనియే యెంచబడవలెను, ముద్దాయి యేమి చెప్పినను అది ఆతనికి వ్యతిరేకముగా నుపయోగించబడ కూడదు, ముద్దాయి అబద్దము చెప్పి నను దారికి శిక్ష లేదు. ముద్దాయిని త్వరగాను, బహిరంగము గాను విచారణ చేయవలెను.క్రిమినలు కేసులలో తొందరగా విచారణ జరిగి త్వరితముగా తీర్పు చెప్పవలసిన దేగాని విశేష శాలయాపన జరిగినచో నేరారోపణ జరిగిన వారికి మిగుల మనోవ్యాకులత కలుగును. పతి క్రిమినలు కేసు లోను ఏజిల్లాలో నేరము జరిగినట్లు చెప్పబడునో ఆజిల్లాలోని నిష్పాక్షికమగు పన్నెందు మండి కిమించని జ్యూరీచే ముద్దాయి నేరముచేసెనా లేదాయని విచారణ జరుగవలెను. నేరము చేసినది లేనిది నిర్ణయించుటకు జ్యూరీకే అధికారము కలదు. జ్యూరీ ముద్దాయి నేరము చేసినట్లు నిర్ణయించినచో న్యాయాధీపతి శాస్త్ర ప్రకారము ఏమి శిక్ష విధించవలెనో నిర్ల యించును. ముద్దాయి. నిర్దోషియని జ్యూరీ చెప్పినచో న్యాయాధిపతి ముద్దాయిని విడుదల చేయవలసినదే. ఎనుబది రూవ్యములు , కిమ్మతుకు మించిన ఆస్తి విషయమైన సివిల్

. .