ఈ పుట ఆమోదించబడ్డది

పొందినవిజయములను, చేసినఘనకార్యములను నబివర్ణించి యున్నాడు.

           "నిలిచివెంటాడితానెమ్మెలుదిరుగు
            ఖలశత్రురాజమృగశ్రేణిమీద
            శ్రీరంగనాథుని సిరినిల్వ జేసి
            తారసి పలుదుర్మదాంధుల నణచి
            నాగూరు గైకొని నవమౌక్తికముల
            ద్యాగంబు బెట్టితి తనియ నర్థులకు
            పరుషత లగ్గలు వట్టించి బోన
            గిరి గొంటి వుప్పొంగికీర్తిదై వార
            తలచినయంతలోదన్న రుసునాట
            గలమహీపతులచే గప్పంబు గొంటి
            శరణన్న యాపాండ్యజననాధు రాజ్య
            పరినిష్టుతుని జేసి పాలించి రర్థి
            బెడిదంబు గలబెట్టుపెరుమాళిమదము
            ముడిగించి తెలుగోలుమూకలచేత
            పంచతిరుపతుల దర్పంబుల చెరిచి
            పంచబంగాళమై పరగంగ జేసి
            శరణన్న తిరుపతి జక్కగా నిలిపి
            తరుదుగామున్నటియట్ల రాజ్యమున
            తోవాళఘట్టాఖ్య దుర్గంబు దాటి
            సావిజేరి యనంతశయను సేవించి