ఈ పుట ఆమోదించబడ్డది

       "మ. కడిమివ్వేంకటరాయశౌరినెదురంగలేక సత్యాహితం
            బడరన్ గౌతమిదాటువేళ నిజకాంతాశ్రుప్రవాహాప్తిగా
            ల్నడ దప్పన్ జడుడై నిజాముడుడుపాలంబున దాటి యె
            క్కడగన్న న్భజియించు నయ్యుడుపరేఖన్నామమోహంబునన్."

        "ఉ. ఆయనుజు ల్విసుద్ధహరిదంత మహాకరిదంత కాంతిరే
            ఖాయతకీర్తులై కొలువ గౌతమినీటనరాతిఘాతి కౌ
            క్షేయకరక్తము ల్గడిగి శ్రీరమణీవరమూర్తి రామభూ
            నాయకు డుర్వి నేలె భువనస్తనీయ జయాభిరాముడై."

ఈకార్యముల నిర్వర్తించుటచేతనే యీతని బిరుదు గద్యములో 'ఆమదానగరసాలభంజన' యనియు, 'గౌతమీస్నానపావనాకార' యనియు బిరుదములు చేర్ప బడినవి.

అళియరామరాయలు బురహాన్ నిజాముషా స్వాధీనుడయినవాడుగనుక నతనికి నిభరామునకు గలమైత్రి మాన్పుకొన వాగ్దత్తముగైకొని యాతనినిర్బంధమునుండి విడిచిపెట్టెను. ఇట్టివిజయములనుగాంచి నట్టితనప్రభువగు నళియరామరాయలను భట్టుమూర్తి తన వసుచరిత్రమునం దట్లభివర్ణించి యున్నాడు.

         "సీ. ప్రజలావలేపవి గ్రహజాయమానాగ్ర
                   హముడించి బహుదానవాప్తిగాంచు