ఈ పుట ఆమోదించబడ్డది

ఇదివిని యచ్చటి సభ్యులందఱు ప్రక్కలు వక్కలగునట్లు నవ్వ నారంభించిరి. అటుతరువాత నెప్పుడును వాబాషు ప్రతినిధి విధానలోపములని యాక్షేపించినవాడు కాడు.

లింకను దన కట్టెగుడిసె వదలిన పదిసంవత్సరములలో నిల్లినాయిలో మహాప్రసిద్ధి వడసెను. ఇచ్చట న్యాయవాదులలో బ్రాముఖ్యు డెవ్వడనిన నాసీమ జనులెల్ల రతనిన చూపుదురు.

1842 వ సంవత్సరమున ముప్పదిమూడు సంవత్సరముల వయస్సున నతడు హానరబిల్ రాబర్టు యస్. టాడ్ కూతురగు మేరి టాడును బెండ్లియాడెను. ఈవివాహమువలన నతనికి రాబర్టు, ఎడ్వార్డుసు, విల్లియము, థామసులను నలుగురు కుమారులు గలిగిరి. ఎడ్వార్డు బిడ్డగా నున్నపుడె చనిపోయె. విల్లియము పండ్రెండు సంవత్సరములవాడై వాషింగుటను పట్టణమున మృతినొందె. థామ నిరువదేండ్లవాడయి యిల్లినాయిలో బరలోక ప్రాప్తి జెందె. రాబర్టుమాత్రము తరువాత వాషింగనులో యుద్ధవిషయిక కార్యదర్శి యయ్యెను.

పదునైదవ ప్రకరణము

న్యాయవాదిత్వము.

లింకను న్యాయవాది యుద్యోగము ప్రారంభించినపు దతనియొద్ద నొక కాసైనను లేకుండెను. స్వారిసేయుటకు