ఈ పుట ఆమోదించబడ్డది

పని యెన్నటికిని జేయనని వాగ్దానము సేసి బ్రతికి నంతకాల మది మఱవకుండెను.

పదునాల్గవ ప్రకరణము

అయాచిత గౌరవప్రాప్తి.

బ్లాక్‌హాకు యుద్ధమునకు దరువాత నాబ్రహాము న్యూసేలమునకు దిరిగివచ్చెను. ఉద్యోగ మేమైన దొరకిన బాగుండునని యోచించుచు గమ్మరిపనిపై దృష్టి సారించెను. ఆవిషయమును గొందఱు మిత్రులు గమనించి యతని జట్ట నిర్మాణసభకు బంప నిశ్చయించితిమని చెప్పిరి. అత డందుల కంగీకరించుట గడుదుర్లభ మాయెను. తనకంటె విద్యావంతులును, ధనవంతులును, అనుభవశాలులును అనేకు లుండ దా నెట్లాపదమునకు బెనగ గలననియు దన కావిషయమున నేలాటి కోరికలు లేవనియు బలుక దొడగెను. ఆ పట్టణములోని గొప్పవారందఱు నతని బ్రతినిధిగ నుండుమని యడుగుట కేతెంచిరి. స్నేహితులు దను విశేషము ప్రార్థించుట జేసి యాబ్రహాము తుట్టతుద కియ్యకొనియెను. అతడు తన నియామకులకు నొడివినమాటల వినుడి:

"ఆర్యులార! స్వదేశసోదరులారా! నే నెవ రైనది మీ రెఱుగుదురని తలచెద. నేను బీద ఆబ్రహాము లింకనును