ఈ పుట ఆమోదించబడ్డది

జేసెను. అంతట వాడు "నీవు నను బడవైచిన వైచితివిగాక. ముష్టియుద్ధమున నాకు నిలువగలవే యని" గర్వోక్తులాడెను.

"నాచేనైనను నిను ముష్టిపొడుపుల బొడువ నే నిష్టపడన"ని గంభీరభావమున బ్రత్యుత్తర మిచ్చుచు హాస్యోక్తిగ "నీ ముష్టిపోటులు నా కనవసరమ" యనియెను.

ఆ మల్లుడు లింకనును విడువక తొందర పెట్ట సాగెను. ఎంత చెప్పినను విననందున నాబ్రహాము "ఇదె నీకొఱకై నిను మర్దించెద"నని లేవబోవ నతడు సమయము గుర్తించి తప్పించుకొనిన జాలునని యూరకుండ నియ్యకొని యాబహాము సౌజన్యతకు మెచ్చి యతని స్నేహము గోరెను.

పండ్రెండవ ప్రకరణము

క్రొత్తయంగడి గుమస్తా.

ఏర్పఱచుకొనినవిధమున లింకను దన యజమానుని న్యూసేలమున గలసెను. సామగ్రి యా పట్టణము జేరు టాలస్యమైనందున లింకను గార్యరాహిత్యమున దిరుగుచుండెను. నిర్వాచన దినమున నొక లేకరికై యధికారులు వెదకుచుండి యెదుటనుండు లింకనునుగాంచి యతనిని నియమించుకొనిరి. అతడు దనశక్తికొలది పనిచేసెద నని నమ్రతతో నియ్యకొ