ఈ పుట ఆమోదించబడ్డది

మార్చుకున్నాడు. క్రైస్తవ, ముస్లింలకు వ్యతిరేకంగా దయానందుడు రాసిన విషయాలను నేడైతే నిషేధించమనేవారే!

వీటిని తిరగరాశారు. సంస్కరణవాదులంతా యిా పని చేశారు రామమోహన్ రాయ్ ఏకేశ్వరవాదనకు అనుకూలంగా వున్నవాటినే స్వీకరించి మిగిలినవి వదలివేసినట్లు లోగడ గమనించాం గదా. అలాగే దయానందుడూ చేశాడు.

ఉదాహరణకు గాయత్రి జపంలో ప్రచోదయాత్ అనే పదాన్ని ప్రాణోదయాత్ అని మార్చేశారు. 'చోద్' అంటే అశ్లీలమైన అర్థం వుండటమే యిందుకు కారణం. అలాగే లింగం అంటే లైంగిక అర్థంలో చూడరాదని, వేదం ప్రకారం యీ పదానికి యజ్ఞస్ధూపం అని భావం అన్నారు. లింగాకారానికి లైంగిక అర్థం, చిహ్నం ఎలా లేకుండాపోతాయో ఆర్యసమాజ్ వారు చెప్పలేదు. సనాతనులు స్త్రీలకు పెట్టిన ఆంక్షలను ఆర్యసమాజ్ కొంతవరకు సడలించింది. స్త్రీలు వేదాలు చదవవచ్చనీ గాయత్రి జపం జపించవచ్చనీ, "ఓం" మంత్రోచ్చారణ చేయవచ్చనీ అన్నారు. సనాతనుల దృష్టిలో స్త్రీలంతా శూద్రులే! పరదా పధ్ధతి కూడా ఆర్యసమాజ్ ప్రోత్సహిం చలేదు. విధవలు మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చన్నారు. సతీసహగమనాన్ని తృణీకరించారు. ఇన్నాళ్ళుగా హిందూ సమాజంలో మతం పేరిట స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను ఆర్యసమాజ్ కొంతమేరకు ఎదుర్కొన్నది. సనాతనుల అమానుష పద్ధతులను బట్టబయలు చేసింది.

దయానందుడు స్త్రీలపట్ల వింతగా ప్రవర్తించాడు. తన బోధనలకు స్త్రీలను రానిచ్చేవాడుకాడు. ఆర్యసమాజ్ వారు సహవిద్యను ప్రోత్సహించలేదు. విడిగానే పాఠశాలలు స్థాపించారు. అయితే స్త్రీలు కూడా ఆర్యసమాజ్ లో చేరవచ్చు. స్త్రీలను దూరంగా వుంచాలనే ధోరణి బుద్ధుడు మొదలు దయానంద వరకు చూపారు.

దయానందుడు అన్నింటినీ తృణీకరించి వేదాలవైపు భారతీయుల్ని నడిపించదలచాడు. కనుక వేదాలు మనల్ని ఎక్కడికి తీసుకపోతాయో చూడాలి.

1875 లో రాజకోటలో ప్రార్ధనా సమాజ్ ను పేరుమార్చి ఆర్యసమాజ్ గా దయానందుడు రూపొందించాడు. అది ఆరుమాసాలే కొనసాగింది. ఆ సంవత్సరం ఏప్రిల్ 10న బొంబాయిలో సంపన్న వర్తకుల మద్దతుతో ఆర్యసమాజ్ ను స్థాపించారు.

1877 జూన్ 24న లాహోర్ లో ఆర్యసమాజ్ ను స్థాపించారు. పంజాబ్ లో యిా సమాజం దశదిశలా వ్యాపించి తన ప్రభావాన్ని చూపెట్టింది.

ఆర్యసమాజ్ స్థాపించిన కొద్ది సంవత్సరాలకే దయానందుడు మరణించాడు.(1883 అక్టోబరు 10).

ఆర్యసమాజ్ ఒక సంస్కరణోద్యమ మత ప్రచారశాఖ, వేదాలవైపు వెనక్కు నడుద్దామని