పుట:Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf/218

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

201 ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక

యుల్లములఁ జూఱగొనునట్టి సామర్థ్య మీకవికిఁ గలిగినను గాఢబంధమువలన మాధుర్య మించుక కొఱవడె ననుట నిజమునకు దవ్వుగాదు. దీనిలో జాంబవతీ వివాహాదులు చెప్పఁబడినవి. అన్నివర్ణనములను గవి ప్రౌఢిమను జూపుచున్నాఁడు. శ్రోతల కపూర్వపద సంయోగముచేతను అశిథిలబంధముచేతను గొంచెము క్లిష్టముగా నగపడును గాని భావరంజకత్వముచే శ్రమాపహారము గలుగును. దీనిలోఁ గొన్నిటి నుదాహరించెదను.

                చ. ఆలఘుకళానిధిం గువలయప్రియు రాజును జూడ రోసి బ
                    ల్దళములతల్పు బిగ్గ నిడి తామరమొగ్గల మూలయింటిలో
                    నలిచెలిగాఁ బరాగపటికావృత మైనసరోరుహేందిరన్
                    గిలకిల నవ్వుచుండ గిలిగింతలు పెట్టుదుగా దినాధిపా.
                                           __________
                చ. జడనిధి మేఖలాఘటిత సర్వమహీ తలవాసులందు నా
                    కడిఁదిప్రదాతచే ధనము గాననివాఁడు మొగిళ్ళక్రిందటన్
                    నడువనివాఁడు భానుకిరణంబులు సోఁకనివాఁడు వానలం
                    దడియనివాఁడు గాడ్పు మెయిఁ దాఁకనివాఁడును లేఁడ యెవ్వఁడున్.
                                           ___________

(7) తంజాపురి రఘునాథుడు.

ఇతఁడు శూద్రకులజుఁడు; అచ్యుతరాయల మఱఁదలిమగఁడు; చోళదేశపు మహారాజు. అనుదినమును బంచాశత్సహస్రభూసురుల కన్న దానముసేసియేభుజించువాఁడు; శ్రీరామభక్తుఁడు. ఇతడు రామసేతు, కుంభకోణ, మన్నారుగుడి, శ్రీరంగ, విజయరాఘవపుర, శ్రీముష్ణ ప్రదేశముల రామభద్ర దేవాలయములు స్థాపించి కీర్తి గన్నవాఁడు. ఇతని యాస్థానమున సంగీతసాహిత్యములు రెండును దులదూగుచు వన్నె కెక్కెను. ఈ కవిరాజునకే విజయవిలాసము, సారంగధరచరిత్ర, కృష్ణాధ్వరిరచిత మగు నైషధపారిజాతీయము, మధురవాణిరామాయణము, అచ్యుతాభ్యుదయము, అంకిత మీయఁబడినవి. విజయవిలాసమున వేంకటపతి రఘునాధరాయల కవితగూర్చి చెప్పిన,

              ఉ. తారసవృత్తి మై ప్రతిపదంబున జాతియు వార్తయుం జమ
                  త్కారము నర్థగౌరవముఁ గల్గ ననేకకృతుల్ ప్రసన్నగం
                  భీరగతిన్ వచించి మహిమించినచో నిఁక శక్తు లెవ్వ
                  రయ్యా రఘునాథ భూపరసికాగ్రణికిం జెవి సోఁక గబ్బముల్."

పద్యము రఘునాధరాయల కావ్యజాలములఁ జదివి చూచినవా రెట్టిస్వభావోక్తిగా గ్రహింతురో చిత్రము. ఇక్కవి వాల్మీక చరిత, రామాయణము, పారిజాతాపహరణము, జానకీ పరిణయము, అచ్యుతాభ్యుదయము, సావిత్రికథ మొదలగునవి పెక్కులు రచించినను రెండు మొదటివిమాత్రమే నాకు లభించినవి. ఇతఁడు

                 "చెప్పవలెఁ గప్పురంబునకు కుప్పలుగాఁ బోసినట్లు కుంకుమ
                  పైపై, కుప్పినక్రియ విరిపొట్లము విప్పినగతి ఘమ్మనం గవిత్వము సభలన్."

అని వాల్మీకి చరిత్రమునఁ చెప్పుకొనినట్లు సర్వజనసౌలభ్యమై యత్యంతమనోహరముగా నున్నది. విజయవిలాసములోఁ బోలె దీనిలో నేదోషములును గానరావు. ఇతని రామాయణమును మెచ్చి మధురవాణి యనువేశ్యారత్నము దానిని సంస్కృతమునకు మార్చెను. ఇట్లే వసుచరిత్రయు విష్ణుచిత్తీయమును, సంస్కృతమునకుఁ దేఁబడినవి. ఇతని రెండుగ్రంథములలోనుండియు నుదాహరించెదను. ఇతనిభావనాశక్తియుఁ గల్పనాశక్తియు సంభాషణ చాతుర్యమును శ్లాఘాపాత్రములు. హాస్యరసమున నితఁడుమిన్న. ఇట్టి చాతుర్యముగలవాఁడు కావుననే విజయవిలాసము నంత మెచ్చుకొనెను. ఎట్టివీర్యమును ఎట్టి కావ్యచాతుర్యము గలవాఁడయినను వేంకటపతి మొద లగు వేశ్యాపుత్రులనడుమను మధురవాణి శశిరేఖ మొదలగు నేఁబదియాఱు వెలయాండ్రనడుమ నితఁడు చిక్కి తననిర్మలకీర్తిపటమున భోగమువలని విషబిందువులఁ జిలికి మలీమసుఁ డయ్యెను.

              సీ. చెలువలు పన్నీరు ♦ చెంబు లిచ్చినఁ గాళి
                            కుప్పెలజల మంచు ♦ గ్రోల నెంచు
                  సతులు జవ్వాది యొ ♦ సంగ గోపిచందన
                            మని ఫాలమున దీర్ప ♦ నగ్గలించు

అమృతాంజనము : _ ఎట్టిజబ్బునకయిననుప్రధమదశలోవాడవచ్చును. వెల 0-8-0