ఈ పుట ఆమోదించబడ్డది

696

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

వచ్చును. ఇది యిట్లుండఁగా గళాపూర్ణోదయమునందు నంద్యాల కృష్ణరాజునుగూర్చి చెప్పఁబడిన షష్ఠ్యంతపద్యములలో

       క. విశ్రుతతిరుమలతాతా
          ర్య శ్రేష్ఠాన్వయసుదర్శనాచార్యతనూ
          జశ్రీనివాసగురుచర
          ణాశ్రయణసమాగ్జితాఖిలాభ్యుదయునకున్

అనీ పింగళసూరన్న 1560 వ సంవత్సర ప్రాంతములయందుండిన కృష్ణ రాజునకు తిరుమల తాతాచార్యవంశజుఁడయిస సుదర్శనౌచార్య పుత్రుఁడగు శ్రీనివాసాచార్యుఁడు గురువయినట్లు చెప్పుటచేత సరిగా తిరుమల తాతాచార్యునకును, నాతని మనుమఁడై న సింగరాచార్యునకును శిష్యుఁడైన రాఘవరెడి యంతకుఁ బూర్వము డెబ్బది యేనుఁబది సంవత్సరములు పూర్వుఁడయి యుండవలెను. పయిని జెప్పఁబడిన రెండు మూఁడు హేతువులను మొ త్తముమీఁద విమర్శించి చూడఁగా విష్ణుపురాణకర్తయగు వెన్నెలకంటి సూరన్న హూణశకము 1480 - 90 సంవత్సర ప్రాంతము లందున్నవాడని నిరాక్షేపముగా నిరూపింప వచ్చును.

వెన్నెలకంటి సూరన్న నియోగి బ్రాహ్మణుఁడు; అమరమంత్రి కుమారుఁడు. ఈతని కవిత్వము మృదుమధురపదభూయిష్టమయి ద్రాక్షాపాకమయి యనర్గళధార కలిగి ప్రవహించుచున్నది. ఇతనిది సలక్షణమయిన మంచి కవిత్వము. ఈతనికవనధోరణిఁ జూఁపుటకయి కొన్ని పద్యములవిష్ణుపురాణ ములోనివాని నీం దుదాహరించుచున్నాను.

       ఉ. ఆపద లేల్ల మాన్చి సుఖమైన పదంబులఁ బూన్చి యాత్మసం
           తాపము లెల్లఁ బుచ్చి విదితంబగు సంపద లిచ్చి భక్తులం
           దేవయుఁడోలె దుఃఖజలధిం బడకుండఁగఁ దేల్చిప్రోవ ల
           క్ష్మీపతి యున్నవాఁడు మదిఁ జింత దొఱంగుము పాకశాసనా, ఆ.1