ఈ పుట ఆమోదించబడ్డది

665

పి ల్ల ల మ ఱ్ఱి పి న వీ ర న్న

అని విచారించి, కవిని బిలిపించి సంబోధించి

       గీ. కలదు చాలంగ బ్రేమ నీవలన నాకు
          వేడ్క వడిగెదఁ గవులెల్ల వేడ్కపడఁగ
          షట్సహస్రకులోద్భవసచివులందు
          సుకృతిగాఁ జేయు నా కొక సుకృతిఁ జేసి.

           *** *** *** ***

       సీ. సరపువ్వులుగ మారి పెక్కుతెఱగుల
                    విరుల నెత్తులుగఁ గావించునట్లు
          కర్పూరకస్తూరికావస్తువితతిచే
                    శ్రీఖండచర్చ వాసించునట్లు
          ఒడికంబుగా గందవోడికి నానాసూన
                    పరిమళంబులు గూడఁ బఱిచినట్లు
          సరఘలు వివిధపుష్పమరందలవములు
                    గొనివచ్చి తేనియఁ గూర్చినట్లు

          భారతప్రోక్తకథ మూలకారణముగ
          గాళిదాసుని నాటక క్రమము కొంత
          తావకో క్తికి నభినవశ్రీ వహింపఁ
          గూర్మిఁ గృతిచేయు నాకు శాకుంతలంబు.

అని ప్రార్థించెను. "వినుతక్ష్మాపాలకామాత్యవేదండానీకమృగేంద్ర" అని ప్రథమాశ్వాసాంతపద్యమునను. "శీత శైలాబ్ధివేలామధ్యక్షితిపాలమంత్రిమకుటాలంకారహీరాంకురా ” అనియు. “సదాస్వామికార్య ప్రియచారనీతి క్రియా " అనియు తృతీయాశ్వాసాంతపద్యములయందును, కృతిపతియైన వెన్నమంత్రి సమస్త రాజమంత్రాలను మించినట్టును. స్వామిహితకార్య తత్పరుఁడై నట్టును కవి యెంత వర్ణించినను వెన్నయామాత్యుఁడే రాజున కమాత్యుఁడో, యెక్కడను జెప్పలేదు. ఈ కృతిపతినిబట్టి రెండవ కృతిపతి