314
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
గతి, బాహు, శక్తి, క్షమలకు సరియైన శకవర్షము 1324. ఈ శ్లోకమునకు సరియైన తెల గుసేతయే పెద్దన కావ్యాలంకారచూడామణి యేడవయుల్లాసమున.
"చతురుపాయ-బాహు-శక్తి- క్షమావళి
బాఱవిడిచి చిత్రభాను సాక్షిఁ
బాఱె సర్వసిద్ధిపదమేది ధరణీవ
వారాహమునకు నోడి రాచకదుపు ?"
సర్వసిద్ధిపదమేది-అనుచో పథమేది-అనియుండుట లెస్స.
అనియుండుటచేత శాసనరచయితకూడఁ బెద్దనయే యయు యుండును
కావ్యాలంకార చూడామణి నాతఁడు శా. స. 1324 న చిత్రభాను సంవత్సరము నకుఁ దరువాత రచియించి యుండును.]
ఈ కవి గ్రంథములోని రెండు పద్యములను మాత్ర మిప్పు డుదాహరించి యీతనిచరిత్రము నింతటితో విరమించెదను.
ఉ. వేడుక విశ్వనాథపృథివీవరసుందరు బిట్టు చూచి తో
డ్తోడన సిగ్గు డగ్గఱుడుఁ దొంగలిఱెప్పలకప్పులోనఁ జి
ట్టాడెడు చూడ్కు లొప్పెఁగుసుమాయుధతూణముఖంబునందు మా
టాడెడు పువ్వు(దూపులన నంగనకుం దరళంపుఁజాయలన్.
శా. శ్రీనిండారఁగ లోకరక్షకొఱకై సిద్దించుటంజేసి ల
క్ష్మీనాధుం డగు నయ్యుపేంద్రుఁ డిపు డేచెంగాన నీ నూతన
క్ష్మానాధుం డగు విశ్వనాథునకు శృంగారాధినాధత్వ మి
ట్లీనోపుం బ్రణుతింప నంచుఁ గవు లుత్ప్రేక్షింతు రెల్లప్పుడున్.
ఈ విన్నకోట పెద్దన ప్రద్యుమ్నచరిత్రమును రచించెనని శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు వ్రాసి, కుమారసంభవము టిప్పణములో నీ క్రింది సద్యముల నుదాహరించిరి.