116
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
నెల్లూరి ప్రజలకు నేర్పు వాటిల్లఁ
జెల్లించె మన్మనసిద్ధిధాజునకు
నెల్లూరుపట్టంబు నేర్పుతోఁ గట్టి
సల్లలితాదృతి సమదుర్గములను
నఱువదెనిమిదియు నగు పట్టణముల
నరుదొంద సాధించి యా మన్మసిద్ధి
రాజు కిచ్చియుఁ దన తేజంబు దిశలఁ
బూజ కెక్కఁగ ఘనరాజితయశుఁడు
ఘన తటాకంబుఁ దాఁ గట్టించె నచటఁ
గొనకొని నెల్లూరఁ గొన్నెల లుండి
మనుమసిద్దికి రాజ్యమహిమలు దెల్పె'
ఈ గ్రంధము కొంత పురాతనమైనను దీనియందు లక్షణదోషము లనేకములు కానవచ్చుచున్నవి. సంగతులు సత్యములే యైనను, ఇందుఁ జెప్పిన సంవత్సరములు మాత్రము చాలవఱకు సరియైనవికావు. ఈ పుస్తకము గణపతిదేవునికాలములోఁ గాక నూఱు నూటయేబcదిసంవత్సరములకుఁ దరువాత విన్న కధలను బట్టి వ్రాయcబడిన దగుటచేత నిందుఁ జెప్పఁబడిన విషయములు సహితమని కొన్ని వ్యత్యస్తములుగా నున్నవి. తిక్కన్న గణపతిదేవునియొద్దకుఁ బోవునప్పటికి యజ్ఞముచేసి యుండలేదు. భారతమును రచియించి యుండలేదు. ఈ పుస్తకము చేయునప్పటికి తిక్కన సోమయాజి యజ్ఞము చేసి భారతము రచియించి యుండుట కవి విని యొఱిఁగినవాడగుటచేత కాల భేదమును నిర్ణయింపలేనివాఁ డయి వెనుక జరిగినదానిని ముందు జరిగినట్టు వ్రాసి యుండును. సోమదేవరాజీయము నందుఁ జెప్పిన సంవత్సరములును దీని ననుసరించియే వ్రాయబడినవి.
(సోమదేవరాజీయము)
గీ|| చేయఁ దక్కువయైన దేవాయతనము
లపుడు పూర్తిగఁ గట్టించి యలరుచున్న
చోట నొకనాcడు తిక్కనసోమయాజి
వచ్చె నెల్లూరినుండి భూవరునికడకు.