ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఏనుగు లక్ష్మణకవి.
ఈకవి బహుగ్రంథములు చేసి ప్రసిద్ధి కెక్కినవాడు. ఈతడు చేసిన గ్రంథములలో రామవిలాసప్రబంధము కడపటిదిగా గనబడుచున్నది. ఈప్రబంధము పెద్దాపుర సంస్థానమం దుండిన శ్రీ వత్సవాయ గోపరాజున కంకితము చేయబడినది. ఈ గోపరాజు తన్నుగూర్చి పలికినట్లు కవి తన రామవిలాసములో నీపద్యముల జెప్పుకొన్నాడు -